E-Paper
Advertisement

Tragedy In Telugu Movie Industry: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత సతీమణి కన్నుమూత

Tragedy In Telugu Movie Industry: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత సతీమణి కన్నుమూత

Telugu Movie Industry Producer Wife Passed away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల అనారోగ్యం క్షీణించడంతో ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇంతలోనే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం రాత్రి మృతి చెందింది.

ఈ విషయం తెలుసుకున్న తన సోదరుడు నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉదయం హైదరాబాద్ బయలుదేరారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, టీడీపీ నాయకులు సంతాపం ప్రకటించారు. కాగా, వరలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె.

మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె వరలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. అయితే తెలుగులో తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అంజి, అరుంధతి వంటి సినిమాలకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. గత కొంతకాలంగా కాన్సర్‌తో బాధపడుతున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి మరణించడంతో పలువురు సినీ సెటబ్రిటీలు, టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నేను డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు.. కానీ, ఎందుకు అయ్యాను అంటే.. ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితోపాటు అల్లు అరవింద్, దిల్ రాజు ఉదయం శ్యాంప్రసాద్ నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాగా, సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×