Big Stories

Pawan Kalyan: సెలబ్రిటీలతో నిండిపోయిన పిఠాపురం.. నేడు రంగంలోకి దిగిన అబ్బాయ్

Pawan Kalyan: ఏపీ ఎన్నికలు రోజురోజుకు హీట్ ఎక్కిస్తున్నాయి. ఈసారి ఆంధ్రా సింహాసనం ఎవరిది అనేది సర్వేలు కూడా తేల్చలేకపోతున్నాయి. అంత గట్టి పోటీ ఉందని చెప్పాలి. ముఖ్యంగా జనసేన ఈసారి తన సత్తా చాటుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం పిఠాపురం మొత్తం సెలబ్రిటీలతో నిండిపోయింది. ఒకపక్క జబర్దస్త్ ఆర్టిస్టులు.. ఇంకోపక్క సీరియల్ నటులు.. మరోపక్క పవన్ కళ్యాణ్.. ఇలా ఒకరి తరువాత ఒకరు గ్యాప్ లేకుండా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

- Advertisement -

ఇక తాజాగా ఈ ప్రచారంలోకి మెగా వారసుడు దిగాడు. నాగబాబు కొడుకు.. వరుణ్ తేజ్ నేడు పిఠాపురంలోకి అడుగుపెట్టాడు. ఉదయమే రాజమండ్రి విమానాశ్రయంలో దిగిన వరుణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక నేటి నుంచి ప్రచారంలో వరుణ్ కూడా పాల్గొనబోతున్నాడు. మొదటి నుంచి కుడామెగా ఫ్యామిలీ పవన్ కు సపోర్ట్ గానే నిలబడింది. మెగా హీరోలు సైతం పవన్ పక్కనే తాము ఉంటామని చెప్పుకొచ్చారు. ఇక మాటలు చెప్పడమే కాకుండా బాబాయ్కోసం అబ్బాయిలు ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో చిరంజీవి, చరణ్ కూడా రాబోతున్నారని తెలుస్తోంది.

- Advertisement -

పిఠాపురంలో సాయంత్రం వరుణ్ ప్రచారం చేయనున్నాడు. తన బాబాయ్ పవన్ ను గెలిపించడానికి ఆయన ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగనున్నాడు. మరి ఈ సెలబ్రిటీల ప్రచారం.. పవన్ కు ఏ రేంజ్ లో ఉంపయోగపడుతుందో చూడాలి. ఇక వరుణ్ కేర్ విషయానికొస్తే.. ఈ మధ్యనే ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం రెండు సినిమాలు లైన్లో ఉన్నాయని టాక్. మరి ఈ సినిమాలతో వరుణ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News