E-Paper
Advertisement

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉంది.. ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉంది.. ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
Advertisement

Arvind Kejriwal health: లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎయిమ్స్ మెడికల్ బోర్టు కీలక విషయాన్ని వెల్లడించింది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మెడికల్ బోర్టు కీలక విషయాన్ని తెలిపింది.

మానీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలపై ఇటీవలే కోర్టుకు ఆశ్రయించారు. టైప్-2 డయాబెటీస్ తో ఆయన జైలులో బాధపుపడుతున్నారని ఆప్ ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని పరీక్షించిన ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ బోర్డు ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించినట్లు తెలుస్తోంది.

Advertisement

డయాబెటీస్ కారణంగా తాను రోజు డాకర్టును సంప్రదించాలని కోరుతూ కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరువురి వాదనలు విన్నకోర్టు.. దీనిపై ఎయిమ్స్ మెడికల్ బోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ ఆరోగ్య బాధ్యతలను ఎయిమ్స్ కి అప్పగించింది.

కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్ కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు శనివారం వీడియో కాన్ఫరెన్స్ లో కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఆయన్ను పరిశీలించిన మెడికల్ బోర్డు ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఆరోగ్యంగానే ఉన్నారంటూ నివేదికను వెల్లడించినట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Also Read: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గాయం..

అయితే ఎయిమ్స్ మెడికల్ బోర్టు దాదాపు అరగంట పాటు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరీక్షించింది. ఆయన ఆరోగ్యంపై వారు ఆరాతీశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఉపయోగిస్తున్న మందులనే వినియోగించాలని బోర్డు సూచించింది. మెడిసిన్ లో ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని కోరింది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉండడంతో.. మరో తర్వాత ఈ బృందం కేజ్రీవాల్ ను మరోసారి పరీక్షించనున్నట్లు పేర్కొంది.

Tags

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

Big Stories

Advertisement
×