BigTV English
Advertisement

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉంది.. ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉంది.. ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!

Arvind Kejriwal health: లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎయిమ్స్ మెడికల్ బోర్టు కీలక విషయాన్ని వెల్లడించింది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మెడికల్ బోర్టు కీలక విషయాన్ని తెలిపింది.


మానీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలపై ఇటీవలే కోర్టుకు ఆశ్రయించారు. టైప్-2 డయాబెటీస్ తో ఆయన జైలులో బాధపుపడుతున్నారని ఆప్ ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని పరీక్షించిన ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ బోర్డు ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించినట్లు తెలుస్తోంది.

డయాబెటీస్ కారణంగా తాను రోజు డాకర్టును సంప్రదించాలని కోరుతూ కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరువురి వాదనలు విన్నకోర్టు.. దీనిపై ఎయిమ్స్ మెడికల్ బోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ ఆరోగ్య బాధ్యతలను ఎయిమ్స్ కి అప్పగించింది.


కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్ కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు శనివారం వీడియో కాన్ఫరెన్స్ లో కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఆయన్ను పరిశీలించిన మెడికల్ బోర్డు ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఆరోగ్యంగానే ఉన్నారంటూ నివేదికను వెల్లడించినట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గాయం..

అయితే ఎయిమ్స్ మెడికల్ బోర్టు దాదాపు అరగంట పాటు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరీక్షించింది. ఆయన ఆరోగ్యంపై వారు ఆరాతీశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఉపయోగిస్తున్న మందులనే వినియోగించాలని బోర్డు సూచించింది. మెడిసిన్ లో ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని కోరింది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉండడంతో.. మరో తర్వాత ఈ బృందం కేజ్రీవాల్ ను మరోసారి పరీక్షించనున్నట్లు పేర్కొంది.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×