E-Paper
Advertisement

Allu Arjun – Jr NTR: అల్లు అర్జున్ ను ఎన్టీఆర్ ఎందుకు కలవలేదంటే..?

Allu Arjun – Jr NTR:  అల్లు అర్జున్ ను ఎన్టీఆర్ ఎందుకు కలవలేదంటే..?
Advertisement

Allu Arjun – Jr NTR: పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఒక మహిళ ప్రాణాలు పోయాయి. ఆమె ప్రాణాలు పోవడానికి కారణాలు అల్లు అర్జున్ కారణం అని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు.. మొన్న బన్నీ నివాసం వద్దే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇక అదే సమయంలో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని టెక్నీకల్ కారణం వల్ల శుక్రవారం రాత్రి జైలులోనే అల్లు అర్జున్ ఉన్నారు.. శనివారం ఉదయం ఆయనను రిలీజ్ చేశారు. శనివారం ఆయన ఇంటికి సినీ ప్రముఖులు వచ్చి పరామర్శిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాలేదు. దీనిపై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ రాకపోవడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

థియేటర్ వద్దకు ఎటువంటి సమాచారం లేకుండా వచ్చారని అందుకే తొక్కిసలాట జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. ఈ కేసు పై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల శుక్రవారం రాత్రి జైలులోనే అల్లు అర్జున్ ఉన్నారు. శనివారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు. న్యాయవాదులతో చర్చలు జరిపి తన నివాసానికి చేరుకున్నారు బన్నీ. అనంతరం జూబ్లీహిల్స్‌ లోని అల్లు అర్జున్ ఇంటికి అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు విచ్చేశారు. దర్శకులు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్‌, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు, అఖిల్, అడవి శేషు తదితరులు వెళ్లి పరామర్శించారు.

Advertisement

అయితే హీరో ప్రభాస్, ఎన్టీఆర్ లు ఫోన్లో మాట్లాడారు.. ఎన్టీఆర్, బన్నీ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి అందరికి తెలుసు. అల్లు అర్జున్, తారక్ చాలా క్లోజ్ గా ఉంటారు. ఇద్దరూ కలిసి ఒకసారి కూడా నటించకపోయినా.. మంచి బాండింగ్ మైంటైన్ చేస్తారు. ఒకరినొకరు బావ అని ప్రేమగాపిలుచుకొనేంత క్లోజ్ గా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో అనేంతగా ఉంటారు. సమయం వచ్చినప్పుడల్లా తమ బాండింగ్ కోసం మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు తారక్ ఎందుకు వచ్చి కలవలేదోనని కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు. నిజానికి ఎన్టీఆర్ ముంబైలో ఉన్నారని తెలుస్తుంది. వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.. ప్రస్తుతం వార్-2 కొత్త షెడ్యూల్ జరుగుతోంది. తారక్, హృతిక్ రోషన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ ను ఎన్టీఆర్ కలవలేదని తెలుస్తోంది. ఫోన్ చేసి బన్నీతో ఆయన మాట్లాడారని టాక్.. ఇక హైదరాబాద్ వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ను తారక్ ను కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×