E-Paper
Advertisement

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

Myanmar: మయన్మార్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారు జామున సమయంలో భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదు అయ్యింది. దీని ప్రభావం భారత్‌పై పడింది. ముఖ్యంగా సెవెన్ సిస్టర్ స్టేట్స్‌లోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తోంది.

భారత్ చుట్టూ భూప్రకంపనలు

మయన్మార్‌లో మంగళవారం వేకువజామున భూకంపం సంభవించింది.  భారత కాలమానం ప్రకారం ఉదయం 6:10 గంటలకు వచ్చినట్టు తెలుస్తోంది.  మయన్మార్‌ తోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

భూకంపం మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఆగ్నేయంగా కేవలం 27 కిలోమీటర్ల దూరంలో ఏర్పడినట్టు గుర్తించారు. భూకంపం 15 కిలోమీటర్లు లోతులో ఏర్పడినట్టు తెలుస్తోంది.  మయన్మార్‌లోని భారత సరిహద్దుకు చాలా దగ్గరగా సంభవించింది. ప్రస్తుతానికి నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు. ఈ ఘటనపై ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

ALSO READ:  గాంధీ విగ్రహంపై పిచ్చిరాతలు, లండన్‌లో దారుణం

జరిగిన నష్టం గురించి అంచనాలు వేయడం మొదలుపెట్టాయి. దీంతోపాటు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలైన అస్సాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయి.  మూడురోజుల కిందట అంటే సెప్టెంబర్ 27న శనివారం బంగ్లాదేశ్‌లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.

భయంతో ఆ ప్రాంత ప్రజలు

దాదాపు మూడు రోజుల తర్వాత భూకంపం రావడంతో ఇంకా భూప్రకంపనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఘటన తర్వాత స్వల్ప ప్రకంపనలు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి.

ఇదిలావుండగా సోమవారం అర్థరాత్రి అంటే 12.09 గంటలకు మహారాష్ట్రలోని సతారాలో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం లోతు 5 కిలోమీటర్ల లోతుగా గుర్తించారు. కొల్హాపూర్‌కు వాయువ్యంగా 91 కి.మీ దూరంలో ఉంది.  బంగ్లాదేశ్, మయన్మార్, భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఆ ప్రాంత ప్రజల్లో భయం మొదలైంది.

 

 

 

 

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×