E-Paper
Advertisement

Earth Quake in Iran : ఇరాన్ లో భారీ భూకంపం.. నలుగురు మృతి

Earth Quake in Iran : ఇరాన్ లో భారీ భూకంపం.. నలుగురు మృతి
Advertisement

Earth Quake in Iran(Latest international news today): ఇరాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య ఇరాన్ ప్రావిన్స్ ఖొరాసన్ రజావిలోని కష్మర్ కౌంటీలో 5.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. నలుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రకృతి విపత్తులో మరో 120 మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

కాగా.. గాయపడినవారిలో 35 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, స్వల్పంగా గాయపడిన వారు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినట్లు కాష్మార్ గవర్నర్ హోజ్జతోల్లా షరియత్మదారి తెలిపింది. భూకంపం ధాటికి భవనాల శిధిలాలు మీద పడటంతో ఇద్దరు, భవనం కూలడంతో మరో ఇద్దరు మరణించినట్లు జిన్హువా మీడియా సంస్థ వెల్లడించింది.

Advertisement

స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.24 గంటలకు భూకంపం సంభవించింది. 6 కిలోమీటర్ల లోతులో వచ్చిన భూ ప్రకంపలనకు సమీపంలోని భవనాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం వచ్చిన కష్మర్ కౌంటీలో 1,63,000 జనాభా ఉన్నారు. కాగా.. 2003లో ఇరాన్ లోని బామ్ నగరంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో 31 వేల మందికి పైగా ప్రజలు మరణించారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×