West Asia Tensions: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నెల రోజుల విరామం తర్వాత ఇరాన్ సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు దిగాయి అమెరికా బలగాలు. ఈ దాడులతో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. అసలు దాడులు జరగడం వెనుక ఏం జరిగింది?
మధ్యప్రాచ్యంలో నెల రోజుల నిశ్శబ్దం తర్వాత యుద్ధం అలజడి మళ్లీ మొదలైంది. అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్-IRGC స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్.. జోర్డాన్లోని అమెరికాకు చెందిన ఎయిర్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్, మెరైన్ బేస్లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.
దీంతో ఆయా నగరాలు దాడులతో దద్దరిల్లాయి. అలాగే బహ్రెయిన్పై డ్రోన్ దాడి, కువైట్పై కూడా దాడులు చేసింది. ప్రయోగించిన 13 క్షిపణులలో పదింటిని జోర్డాన్ అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు మరణించారన్న ఐఆర్జిసి వాదనను అమెరికా తోసిపుచ్చింది. వాస్తవానికి సెంట్రల్ కమాండ్- సెంట్కామ్ తన ప్రకటనలో ప్రాణనష్టం గురించి ప్రస్తావించలేదు.
మంగళవారం హోర్ముజ్ జలసంధి సమీపంలో ఐఆర్జిసి లక్ష్యాలపై అమెరికా దాడి చేయడంతో ఘర్షణ తీవ్రమైంది. వాణిజ్య నౌకలు, అక్కడ మోహరించిన అమెరికా సైనికులపై ఇరాన్ దాడికి ప్రయత్నించినందుకు ప్రతిస్పందనగా మంగళవారం సాయంత్రం ఈ ఆపరేషన్ ప్రారంభమైందని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం.. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, చబహార్, జాస్క్, సిరిక్, కొనరాక్, లవాన్ ప్రాంతాలు పేలుళ్లు సంభవించాయి. జిరోఫ్ట్ నగరంలోని ఓ విమానాశ్రయంపై దాడి జరిగినట్లు తెలిసింది. సిరిక్ నుండి వచ్చి వివాహ వేడుక జరుగుతున్న ఇంటిపై అమెరికా సైన్యం దాడి చేసినట్టు తెలిపింది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ నివేదిక మేరకు.. ఓ చిన్నారితో సహా కనీసం నలుగురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధంగా చెప్పారు. ట్రూత్ సోషల్లో పెట్టిన పోస్ట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద దాడి జరగబోనుందని ఇరాన్ను హెచ్చరించారు. ఐఆర్జీసీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దాడుల తర్వాత ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ తన తొలి సందేశాన్ని ఇచ్చారు. తమ బలగాలు వాషింగ్టన్కు ఎన్నటికీ మరచిపోలేని గుణపాఠాలు నేర్పాయి, నేర్పుతాయని హెచ్చరించారు. దురాక్రమణలకు దిగితే శిక్ష తప్పదని, అమెరికా పశ్చాత్తాపపడే పరిస్థితి వస్తుందని ఐఆర్జీసీ ప్రతినిధి హొస్సేన్ మొహెబి హెచ్చరించారు.
ALSO READ: పాక్లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!
Today at 12 p.m. ET, U.S. forces began striking Islamic Revolutionary Guard Corps (IRGC) targets in Iran. The strikes follow recent attempted attacks by the IRGC against commercial shipping in the Strait of Hormuz and against American service members deployed to the region.
— U.S. Central Command (@CENTCOM) September 1, 2026