E-Paper
Advertisement

Pakistan: పాక్‌లో 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?

Pakistan: పాక్‌లో 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?
Advertisement

Pakistan: ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అట్టుడుకుతోంది. నిత్యావసర ధరలు పెరిగి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంక కంటే దారుణంగా మారుతోంది పాకిస్థాన్. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్ ప్రభుత్వం అప్పుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న తమ ఎంబసీ ఆస్తులను వేళానికి పెట్టింది.

ఇక పాలు, ఇంధన ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ. 280కి చేరింది. అది కూడా సరిపడినంత అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2.06 లక్షల పాకిస్థానీ రూపాయలకు చేరింది. దీంతో అక్కడి జనాలు బంగారం కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు.

Advertisement

ప్రస్తుతం పాక్‌లో ద్రవ్యోల్బణం 50 సంవత్సరాల గరిష్ఠానికి చేరుకుంది. ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ 31.5 శాతానికి చేరింది. మరోవైపు ఫారెక్స్ నిల్వలు సరిపడా లేకపోవడంతో అత్యవసర ఔషధాలు, ఇతర మెడిసిన్ ముడిసరుకు దిగుమతి చేసుకోలేక పాక్ సర్కార్ తీవ్ర ఇబ్బందులుపడుతోంది. మరోవైపు సరైన సమయానికి మందులు అందక ఆసుపత్రుల్లో రోగులు అవస్తలు పడుతున్నారు.

Tags

Related News

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

Big Stories

Advertisement
×