E-Paper
Advertisement

USA: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. అమెరికా వైమానికి దళంలో కీలక పదవి

USA: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. అమెరికా వైమానికి దళంలో కీలక పదవి
Advertisement

USA: ప్రపంచ దేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు సత్తా చాటుతున్నారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి రాజా చారికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. దీనిని సెనేట్ ఆమోదిస్తే అమెరికా వాయుసేనలో రాజా చారి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. రాజాచారి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

2021లో నాసా సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ బృందంలో రాజా చారి కూడా ఉన్నారు. అంతరిక్షంలో 177 రోజులు ఉండి స్పేస్ వాక్ కూడా నిర్వహించారు. నాసాలో చేరకముందు ఆయన అమెరికా ఎయిర్‌ఫోర్సులో టెస్ట్ పైలట్‌గా ఉన్నారు.

Tags

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×