E-Paper
Advertisement

Big Ticket draw: ఆరేళ్ల తర్వాత .. డ్రైవర్‌కు 64 కోట్ల జాక్‌పాట్, ఇండియాకు పయనం

Big Ticket draw: ఆరేళ్ల తర్వాత .. డ్రైవర్‌కు 64 కోట్ల జాక్‌పాట్, ఇండియాకు పయనం
Advertisement

Big Ticket draw: ప్రయత్నం చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుందని నిరూపించాడు పైన కనిపిస్తున్న ఓ డ్రైవర్. ఒకటి రెండు కాదు ఏకంగా ఆరేళ్లపాటు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేశాడు. చివరకు 64 కోట్ల రూపాయలను లాటరీ ద్వారా గెలుచుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడ? అన్న డీటేల్స్ లోకి వెళ్లొద్దాం.

దుబాయ్‌లో ఇండియా డ్రైవర్ కు జాక్‌పాట్

Advertisement

పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు అబ్దుల్‌ రషీద్‌. కేరళంకు చెందిన ఈ వ్యక్తి దాదాపు 17 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. ఆయన ఫ్యామిలీ కేరళంలో ఉంటోంది. దుబాయ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది లాటరీ. రషీద్ కూడా అదే చేశాడు. గడిచిన ఆరేళ్లుగా బిగ్ టికెట్ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ వస్తున్నాడు.

రషీద్ మాత్రం లాటరీ తగలపోయినా నిత్యం అదే పనిలో ఉన్నాడు. చివరకు 25 మిలియన్ దిర్హమ్‌ల బిగ్ టిక్కెట్ లాటరీ కొనుగోలు చేశాడు. ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ. 64 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. ఊహించని జాక్‌పాట్‌ తగలడంతో ఆనందంలో మునిగిపోయాడు. అయితే ఆ లాటరీ టికెట్‌ను కొంతమంది సభ్యులు కలిసి కొనుగోలు చేశారు.

Advertisement

బిగ్ టికెట్  లాటరీలో రూ. 64 కోట్లు గెలుచుకున్నాడు, మరొక డ్రైవర్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు

అందులో రషీద్ కూడా భాగస్వామి. వచ్చే డబ్బును అందరం కలిసి పంచుకుంటామని చెప్పాడు. లాటరీ గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం ఉద్యోగం మానేసే ఆలోచన లేదన్నాడు. దాని టర్మ అయిన తర్వాత ఇండియాకు వచ్చేస్తానని చెప్పాడు. లాటరీలో వచ్చిన డబ్బును ఎలా ఉపయోగించాలో కుటుంబ సభ్యులు, స్నేహితులను సంప్రదిస్తానని తెలిపాడు.

అబుదాబిలో నివాసం ఉంటున్నాడు కేరళకు చెందిన మరొక డ్రైవర్ అష్రఫ్ అబ్దుల్లా. ఆయన వయస్సు దాదాపు 40 ఏళ్లు పైనే ఉంటుంది. డ్రీమ్ కార్ విభాగంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుని గెలుచుకున్నాడు. అతడు గడిచిన 16 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు.

ALSO READ: అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ భారత్‌కు ఉపశమనం.. హోర్మూజ్ జలసంధిని దాటిన ‘సర్వశక్తి’

అబ్దుల్లా ఫ్యామిలీ మాత్రం ఇండియాలో ఉంటోంది. లాటరీలో కారు గెలవడంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. డ్రీమ్ కార్ టిక్కెట్‌ను కొనుగోలు చేయమని తన స్నేహితుడు సలహా ఇచ్చాడని తెలిపాడు. మొత్తానికి ఇద్దరు కేరళం వాసులకు జాక్ పాట్ తగలడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

Related News

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

Big Stories

Advertisement
×