E-Paper
Advertisement

Iran Permission: దౌత్యం ఫలించింది.. ఇరాన్ గ్రీన్‌ సిగ్నల్, ఇండియా షిప్‌లకు అనుమతి

Iran Permission: దౌత్యం ఫలించింది.. ఇరాన్ గ్రీన్‌ సిగ్నల్, ఇండియా షిప్‌లకు అనుమతి

Iran Permission: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఆసియాకు కీలకంగా మారింది హార్ముజ్ జలసంధి. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్‌తో జలసంధి దాటేందుకు నౌకలు ప్రయత్నాలు చేయలేదు. దీని కారణంగా ఎగుమతులు లేవు, దిగుమతులు లేవు. తాజాగా భారత్ విదేశాంగ శాఖ చేసిన చర్చలతో ఇరాక్ కాస్త మెత్తబడింది. ఫలితంగా భారత్ కి చెందిన రెండు షిప్‌లకు అనుమతి ఇచ్చింది.

ఇండియా దౌత్యం ఫలించింది.. ఇరాన్ గ్రీన్‌ సిగ్నల్

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత కీలకమైంది హార్ముజ్ జలసంధి. గల్ఫ్ నుంచి ఆసియా వైపు ఏ నౌకలు వెళ్లాలన్నా కచ్చితంగా పెర్షియన్ గల్ఫ్‌-ఒమన్ గల్ఫ్‌తో కలిపే ఇరుకైన జలసంధిని దాటాల్సిందే.  వార్ జఠిలమైన నేపథ్యంలో ఆ జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై ఆంక్షలు విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నౌకలను రానిచ్చేది లేదని తేల్చేసింది. కాదని మొండి కేస్తే పేల్చేస్తామని హెచ్చరించింది.

ఫలితంగా దాదాపు వందల నౌకలు పెర్షియన్ గల్ఫ, అటు ఒమన్ గల్ఫ్ తీరంలో ఆగిపోయాయి. ఇరాన్ హెచ్చరికలను పట్టించుకోని రెండు నౌకలు బుధవారం జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తుండగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ దాడి చేశాయి. ఫలితంగా షిప్‌లు డ్యామేజ్ అయ్యాయి.

ముంబై తీరానికి  రెండు ఆయిల్ షిప్‌లు

గడిచిన పది రోజులుగా పరిస్థితి గమనించింది భారత్. దీంతో మంగళవారం రాత్రి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చితో చర్చలు జరిపారు.  దీని ఫలితంగా భారత్‌కు చిన్న ఉపశమనం లభించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత్ జెండాతో ఉన్న నౌకలు ఈ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు అనుమతించినట్లు సమాచారం.

పుష్పక్, పరిమళ్ పేరిట ఉన్న రెండు ఇండియన్‌ ట్యాంకర్లు హర్మూజ్‌ జలసంధి దాటినట్లు తెలిపాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు అక్కడే ఉండిపోయాయి. యుద్ధం ప్రారంభమైన నుంచి జైశంకర్‌-అరాగ్చీల మధ్య మూడుసార్లు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మంగళవారం హర్మూజ్‌ నుంచి ట్యాంకర్లు గమ్యస్థానానికి చేరడంపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు.ఆ తర్వాత ఇరాన్ ఓకే చెప్పింది.  దీంతో రెండు నౌకలు వచ్చాయి. దీంతో భారత్‌కు కొంత రిలీఫ్ దక్కింది.

ALSO READ: ఇరాన్ కొత్త టార్గెట్.. టెక్ కంపెనీలు, బ్యాంకింగ్ సంస్థలు తదుపరి లక్ష్యం

ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్రం మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. ఈ మార్గం గుండా ప్రతిరోజూ 20 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడిచమురు వివిధ దేశాలకు వెళ్తుంది. ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు ఐదో వంతు కూడా. సముద్రమార్గ చమురు వ్యాపారంలో దాదాపు పావు వంతుకు సమానం. సహజ వాయువు రవాణాలో అధిక భాగం ఈ కారిడార్ ద్వారానే వెళ్తుంది.

ఈ జలసంధి ద్వారా రవాణాకు ఏదైనా అంతరాయం కలిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, షిప్పింగ్ మార్గాలను ప్రభావితం చేస్తుంది. భారత షిప్పింగ్ శాఖకు చెందిన పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారత జెండాతో కూడిన నౌకలు పని చేస్తున్నాయి. వీటిలో 24 నౌకలు హార్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్నాయి. నాలుగు నౌకలు జలసంధికి తూర్పున  ఉంటాయి.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×