E-Paper
Advertisement

Landslides kill 12 on Indonesia: ఇండోనేషియాలో బంగారు గనిలో ప్రమాదం.. 12 మంది మృతి

Landslides kill 12 on Indonesia: ఇండోనేషియాలో బంగారు గనిలో ప్రమాదం.. 12 మంది మృతి
Advertisement

Landslides kill 12 on Indonesia: ఇండోనేషియాలో విషాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని ఓ బంగారు గనిలో ప్రకృతి వైపరీత్యానికి 12 మంది దుర్మరణం చెందగా.. 18 మందికిపైగా ఆచూకీ లభ్యం కావడం లేదని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గనిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన 12 మంది మృతదేహాలను రెస్క్యూ ఏజెన్సీ వెలికితీసింది.

గోరోంటలోని ప్రావిన్స్‌లో సుమావా జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటను సమీపంలో ఓ బంగారు గనిలో నివసిస్తున్న గ్రామస్తులపై కొండచరియలు విరిగి మట్టి పడింది. ఒక్కసారిగా మట్టి పడడంతో ఊపిరాడగా చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రిమోట్ బోన్ బొలాంగోలో అక్రమంగా పనిచేస్తున్న సుమారు 33 మందిలో 12 మంది మృతి చెందిన్లు గోరంటా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి అఫీఫుద్దీన్ ఇలాహుడే తెలిపాడు.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు రక్షణ బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో చిక్కుకున్న ఒకరిని సురక్షితంగా వెలికితీశారు. గల్లంతైన మిగతా వారికోసం గాలింపు చేపట్టారు. చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నట్లు ఏజెన్సీ బృందం తెలిపింది.

Also Read: సౌత్ కొరియాలో జీతాలు పెంచాలని ఉద్యోగుల నిరసన.. శాంసంగ్ చరిత్రలో అతిపెద్ద స్ట్రైక్!

Advertisement

భారీ వర్షాల నేపథ్యంలో నేషనల్ రెస్క్యూటీమ్, పోలీసులు, ఆర్మీ సిబ్బందితో సహా 164 మంది సిబ్బంది మోహరించారు. కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే గత కొంతకాలంగా ఇండోనేషియాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్రమంగా పనిచేయడంతో చాలామంది ప్రమాదబారిన పడుతున్నట్లు చెబుతున్నారు.

Tags

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×