E-Paper
Advertisement

Landslides kill 12 on Indonesia: ఇండోనేషియాలో బంగారు గనిలో ప్రమాదం.. 12 మంది మృతి

Landslides kill 12 on Indonesia: ఇండోనేషియాలో బంగారు గనిలో ప్రమాదం.. 12 మంది మృతి
Advertisement

Landslides kill 12 on Indonesia: ఇండోనేషియాలో విషాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని ఓ బంగారు గనిలో ప్రకృతి వైపరీత్యానికి 12 మంది దుర్మరణం చెందగా.. 18 మందికిపైగా ఆచూకీ లభ్యం కావడం లేదని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గనిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన 12 మంది మృతదేహాలను రెస్క్యూ ఏజెన్సీ వెలికితీసింది.

గోరోంటలోని ప్రావిన్స్‌లో సుమావా జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటను సమీపంలో ఓ బంగారు గనిలో నివసిస్తున్న గ్రామస్తులపై కొండచరియలు విరిగి మట్టి పడింది. ఒక్కసారిగా మట్టి పడడంతో ఊపిరాడగా చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రిమోట్ బోన్ బొలాంగోలో అక్రమంగా పనిచేస్తున్న సుమారు 33 మందిలో 12 మంది మృతి చెందిన్లు గోరంటా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి అఫీఫుద్దీన్ ఇలాహుడే తెలిపాడు.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు రక్షణ బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో చిక్కుకున్న ఒకరిని సురక్షితంగా వెలికితీశారు. గల్లంతైన మిగతా వారికోసం గాలింపు చేపట్టారు. చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నట్లు ఏజెన్సీ బృందం తెలిపింది.

Also Read: సౌత్ కొరియాలో జీతాలు పెంచాలని ఉద్యోగుల నిరసన.. శాంసంగ్ చరిత్రలో అతిపెద్ద స్ట్రైక్!

Advertisement

భారీ వర్షాల నేపథ్యంలో నేషనల్ రెస్క్యూటీమ్, పోలీసులు, ఆర్మీ సిబ్బందితో సహా 164 మంది సిబ్బంది మోహరించారు. కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే గత కొంతకాలంగా ఇండోనేషియాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్రమంగా పనిచేయడంతో చాలామంది ప్రమాదబారిన పడుతున్నట్లు చెబుతున్నారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×