E-Paper
Advertisement

పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 18 మందికి గాయాలు

పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 18 మందికి గాయాలు
Advertisement

Pakistan blast: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో ఏడుగురు మరణించగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్కీ మార్వత్ జిల్లాలోని అత్యంత రద్దీగా ఉండే నౌరంగ్ బజార్‌ సమీపంలోని ‘ఫట్టక్ చౌక్’వద్ద ఈ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు ఒక ఆటో రిక్షాలో అమర్చిన శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని (IED) లక్ష్యంగా చేసుకుని పేల్చివేయడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.

మరణించిన వారిలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు ఉండగా.. మిగిలిన వారు సాధారణ పౌరులు. గాయపడిన వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు , పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పేలుడు ధాటికి అక్కడి వాహనాలు ధ్వంసమవడమే కాకుండా స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తుందనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read:   కేరళలో భారీ అగ్ని ప్రమాదం.. రెండు స్కూల్ బస్సుల దగ్ధం

Related News

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

Big Stories

Advertisement
×