E-Paper
Advertisement

పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 18 మందికి గాయాలు

పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 18 మందికి గాయాలు
Advertisement

Pakistan blast: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో ఏడుగురు మరణించగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్కీ మార్వత్ జిల్లాలోని అత్యంత రద్దీగా ఉండే నౌరంగ్ బజార్‌ సమీపంలోని ‘ఫట్టక్ చౌక్’వద్ద ఈ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు ఒక ఆటో రిక్షాలో అమర్చిన శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని (IED) లక్ష్యంగా చేసుకుని పేల్చివేయడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.

మరణించిన వారిలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు ఉండగా.. మిగిలిన వారు సాధారణ పౌరులు. గాయపడిన వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు , పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పేలుడు ధాటికి అక్కడి వాహనాలు ధ్వంసమవడమే కాకుండా స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తుందనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read:   కేరళలో భారీ అగ్ని ప్రమాదం.. రెండు స్కూల్ బస్సుల దగ్ధం

Related News

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

అమెరికాలో షాకింగ్ ఘటన.. నువ్వు ముస్లిమా అంటూ, భారతీయుడ్ని 15 సార్లు కత్తితో పొడిచి..

Big Stories

Advertisement
×