Kerala: కేరళలోని ఇడుక్కి జిల్లాలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పార్క్ చేసి ఉన్న రెండు స్కూల్ బస్సులు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకున్నాయి. క్షణాల్లోనే మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బస్సుల్లో విద్యార్థులు గానీ, డ్రైవర్లు గానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులు పార్క్ చేసిన కొద్దిసేపటికే ఒక బస్సు ఇంజిన్ నుంచి పొగలు రావడం మొదలైంది. చూస్తుండగానే మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు కూడా వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేలోపే రెండు బస్సులు పూర్తిగా కాలిపోయి కేవలం అస్థిపంజరాల్లా మిగిలాయి.
బస్సులు తగలబడటానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, స్కూల్ నడుస్తున్న సమయంలో లేదా విద్యార్థులు ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ , వైరింగ్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాద.. బైక్ను ఢీకొట్టి పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి!
రెండు స్కూల్ బస్సులు దగ్ధం.. తప్పిన ప్రాణాపాయం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పార్క్ చేసి ఉన్న రెండు స్కూల్ బస్సులు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. pic.twitter.com/KEfSn9jpVK
— ChotaNews App (@ChotaNewsApp) May 12, 2026