Charlie Kirk: అమెరికాలో మరోసారి రాజకీయ హింస పురివిప్పింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అనుచరుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ దారుణ హత్యకు గురయ్యారు. ఓ ఈవెంట్ లో మాట్లాడుతుండగా దుండగులు దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. ఆసుపత్రికి తరలించేలోపు చార్లీ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. అసలు ట్రంప్ సన్నిహితుడ్ని చంపడం వెనుక కారణమేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా హింస రాజకీయాలు ఊపందుకున్నాయి. ఒకప్పుడు హుందాగా రాజకీయాలు సాగేవి. పరిస్థితులు మారిపోయాయి. ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ చంపుకునే రోజులు వచ్చేశాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ 31 ఏళ్ల చార్లీ కిర్క్ దారుణ హత్యకు గురయ్యారు.
ఉటా వ్యాలీ యూనివర్సిటీలో మాస్ షూటింగ్స్పై చర్చ కార్యక్రమానికి చార్లీ కిర్క్ హాజరయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ టెంట్లో చార్లీ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంతంలో ఓ విద్యార్థి ప్రశ్నకు బదులిస్తున్న సమయంలో సమీపం నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు.
నిందితుడు చార్లీ మెడ భాగంలో కాల్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. కుర్చీలోనే కుప్పకూలాడు కిర్క్. ఈ ఘటనతో అక్కడి విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. తీవ్రగాయాలు పాలైన చార్లీ కిర్క్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతిచెందాడు. చార్లీ మరణించినట్లు అధ్యక్షుడు ట్రంప్ ధ్రువీకరించారు.
ALSO READ: పుష్ప తరహాలో ఆ దేశానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్
సన్నిహితుడు మృతిపై అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తని సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలన్నారు. అమెరికాలో యువతను చార్లీ కంటే అర్థం చేసుకున్నవారు ఎవరు లేరన్నది ట్రంప్ మాట.
ఈ ఘటనకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రంప్కు అత్యంత సన్నిహితుడుగా చార్లీకి మాంచి పేరు ఉంది. 18 ఏళ్లకే చార్లీ ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ ఆర్గనైజేషన్ను ప్రారంభించాడు. యూనివర్సిటీలో తన కార్యక్రమానికి ముందు చార్లీ కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నట్లు అక్కడి మీడియా చెబుతోంది.
ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ దాదాపు వెయ్యి మంది సంతకాలతో కూడిన ఓ ఫిర్యాదు యూనివర్సిటీ అధికారులకు అందింది. తాము భావ ప్రకటన స్వేచ్ఛ, నిర్మాణాత్మక చర్చలకు మద్దతు ఇస్తామని చెబుతూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసింది. దాని ఫలితంగా చార్లీ ఈలోకాన్ని విడిచిపెట్టాడు.
ఈ కార్యక్రమానికి 3,000 మందికి యువతీ యువకులు హాజరయ్యారు. ఈ ఘటనలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అక్కడి అధికారులు. ఇంతకీ చార్లీని దుంగడులు చంపాల్సిన అవసరం ఏమోచ్చింది? ట్రంప్ హయాంలో శాంతి భద్రతలు దారి తప్పుతున్నాయా? వంటి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్య
ఉటా వ్యాలీ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా తుపాకీతో కాల్చిన ఓ దుండగుడు
తీవ్ర గాయాలైన చార్లీ కిర్క్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స… pic.twitter.com/SEjXM4iBl6
— BIG TV Breaking News (@bigtvtelugu) September 11, 2025