E-Paper
Advertisement

OTT Movie : ఇంట్లో ఎవరూ లేని టైంలో బాయ్ ఫ్రెండ్‌తో… తల్లి చెప్పిందేంటి, ఈ పాపా చేస్తుందేంటి మావా ?

OTT Movie : ఇంట్లో ఎవరూ లేని టైంలో బాయ్ ఫ్రెండ్‌తో… తల్లి చెప్పిందేంటి, ఈ పాపా చేస్తుందేంటి మావా ?
Advertisement

OTT Movie : కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ నటించిన “అచ్చం మడం నానం పయిర్పు” సినిమా యువతని బాగా ఆకట్టుకుంటోంది. ఈ కథ చెన్నైలోని సాంప్రదాయ తమిళ కుటుంబంలో జీవించే పవిత్ర అనే 19 ఏళ్ల యువతి (అక్షరా హాసన్) చుట్టూ తిరుగుతుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ఒక రాత్రి గడపడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా నడుస్తుంది. ఇది సౌత్ ఆసియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో సౌత్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్, తస్వీర్ సౌత్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో గుర్తింపు పొందింది. ఈ స్టోరీ ఏమిటి ? ఈ సినిమా ఎక్కడ ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

స్టోరీలోకి వెళ్తే

పవిత్ర చెన్నైలోని సాంప్రదాయ వెజిటేరియన్ కుటుంబంలో పెరిగిన యువతి. తన తల్లి సౌమ్య, తండ్రి భార్ద్వాజ్ ఆమె మీద ఎక్కువగానే అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఆమె కర్ణాటక సంగీత గురువు చారుకేసి వద్ద క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఆమె హరిష్‌ అనే ఒక క్రికెటర్ తో రహస్యంగా డేటింగ్ చేస్తుంది. కానీ ఇంట్లో వాళ్లకు భయపడుతుంటుంది. ఆమె స్నేహితులు జెస్సికా, రతి ఆమె ఆలోచనలను బ్రేక్ చేస్తారు. ఆతరువాత ఆమె నాన్-వెజ్ ఆహారం ఇష్టపడటం, సంగీత కాన్సర్ట్‌లో పాల్గొనడం వంటి చిన్న తిరుగుబాట్లు ఆమెలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. స్నేహితులతో కలసి ఇక అలాంటి టాపిక్స్ కూడా మాట్లాడుకుంటారు. ఇది ఆమెలో యవ్వనంలో వచ్చే కోరికలవైపు మనసు వెళ్లేలా చేస్తుంది.

Advertisement

ఆమె తల్లిదండ్రులు ఒక పని మీద బయటికి వెళ్లినప్పుడు, పవిత్ర హరిష్‌తో సన్నిహితంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. కానీ కాన్డోమ్ కొనడంలో స్టోర్ ఓనర్ అన్నాచితో జరిగే ఇబ్బందులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సంఘటనలు ఆమె ప్లాన్‌ను అయోమయంలో పడేస్తాయి. ఈ సంఘటనల మధ్య, పవిత్ర తన కోరికలు, కుటుంబ నీతులు, సామాజిక ఒత్తిడుల మధ్య ఒత్తిడిని అనుభవిస్తుంది. ఆమె సంగీత కాన్సర్ట్‌లో బిజీగా ఉంటూ, తన ఆలోచనలను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయాణంలో ఆమె తన కోరికను తీర్చుకుంటుందా ? మరేమైనా సమస్యలు వస్తాయా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

“అచ్చం మడం నానం పయిర్పు” (Achcham Madam Naanam Payirppu) 2022లో విడుదలైన తమిళ కామెడీ చిత్రం. దీనిని రాజా రామమూర్తి దర్శకత్వంలో ట్రెండ్‌లౌడ్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇందులో అక్షరా హాసన్ (పవిత్ర), ఉషా ఉత్తూప్ (చారుకేసి, సంగీత గురువు), సురేష్ చంద్ర మేనన్ (భార్ద్వాజ్, పవిత్ర తండ్రి), అంజనా జయప్రకాష్ (రతి, స్నేహితురాలు) ప్రధాన పాత్రల్లో నటించారు. 2022 మార్చి 25న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. అదే రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈసినిమా IMDb లో 6.5/10 రేటింగ్ పొందింది.

Advertisement

Read Also : డిన్నర్ కోసం వెళ్లి దిక్కుమాలిన ట్రాప్‌లో… ఈ క్రేజీ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉందంటే?

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×