E-Paper
Advertisement

ట్రంప్ టారిఫ్ రీఫండ్.. అమెరికా చరిత్రలో అతి పెద్దది, ఏకంగా 15 లక్షల కోట్లు వెనక్కి, ఆ నిధులు ఎవరికి వస్తాయి?

ట్రంప్ టారిఫ్ రీఫండ్.. అమెరికా చరిత్రలో అతి పెద్దది, ఏకంగా 15 లక్షల కోట్లు వెనక్కి, ఆ నిధులు ఎవరికి వస్తాయి?
Advertisement

America Tariff Refunds: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ వ్యవహారంగురించి కొత్త న్యూస్. అధ్యక్షుడు విధించిన టారిఫ్ చట్ట విరుద్ధమని ఆదేశ సుప్రీం కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల పేరిట వసూలు మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు రెడీ అయ్యింది అమెరికా ప్రభుత్వం. సుమారు 166 బిలియన్ డాలర్ల విలువైన సుంకాల నిధులను వాపసు చేయనుంది. ఈ నిధులు ఎవరికి దక్కనున్నాయి?

అమెరికా ట్రంప్ టారిఫ్‌ల రీఫండ్ మొదలు

Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లపై రిఫండ్ కార్యక్రమం మొదలైంది. ఈ విధంగా టారిఫ్‌లు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ సర్కార్ సుమారు 166 బిలియన్ డాలర్ల విలువైన నిధులను వాపసు పనిలో పడింది. ఇండియన్ కరెన్సీలో దాదాపు 15 లక్షల కోట్లు అన్నమాట. ఈ విధంగా రీఫండ్ ఇవ్వడం అమెరికా చరిత్రలో అతి పెద్దది.

యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆన్‌లైన్ పోర్టల్‌ని ప్రారంభించింది. సోమవారం ఉదయం నుంచి 3.3 లక్షల మంది దిగుమతిదారులు క్లెయిమ్‌లను దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా రీఫండ్ బదిలీ చేస్తున్నారు. వేగంగా డబ్బు తిరిగి చెల్లించే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

Advertisement

ఏకంగా 15 లక్షల కోట్లు వెనక్కి.. వస్తువులు కొనుగోలు చేసినవారి పరిస్థితి ఏంటి?

అమెరికా ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు.. దాదాపు 15 లక్షల కోట్లు చెల్లించనుంది. ఏప్రిల్‌ 14 నాటికి 56,497 సంస్థలు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నాయి. రిఫండ్‌ ఫైలింగ్‌కు అర్హత సాధించినట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. కొత్తి కంపెనీలు కన్సాలిడేటెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ ఆఫ్‌ ఎంట్రీస్‌ ద్వారా షిప్‌మెంట్, టారిఫ్‌ చెల్లింపులను ఫైల్‌ చేయాలి.

దిగుమతిదారులు దరఖాస్తు ఆమోదం తర్వాత 60 నుంచి 90 రోజుల్లో నిధులు వాపసు ఇవ్వనుంది. ఏమైనా సాంకేతిక సమస్యలుంటే ఆలస్యం కావచ్చని చెబుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఇస్తున్న రీఫండ్ వినియోగదార్లకు లభిస్తుందా? అన్నదే అసలు ప్రశ్న. వివిధ దేశాల నుంచి వచ్చిన ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌లు తొలుత దిగుమతిదారులు చెల్లించారు.

ALSO READ: అమెరికాలో అంతర్జాతీయ ఆయుధాల కుట్ర.. ఇరాన్‌తో డీల్స్ చేస్తున్న షమీమ్ మాఫీ అరెస్ట్!

ఆ తర్వాత ఆ వస్తువులను విక్రయించినప్పుడు అధిక ధరలకు వినియోగదారులకు విక్రయించేవారు. ఆ లెక్కన ఆ మొత్తాన్ని వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీలు స్వచ్ఛందంగా తమకు అందే రిఫండ్‌ను వినియోగదార్లకు ఇవ్వాలి. డెలివరీ దిగ్గజ కంపెనీలు రిఫండ్‌ వచ్చిన వెంటనే వినియోగదార్లకు వాటిని బదిలీ చేస్తామని చెబుతున్నాయి.

Related News

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

అమెరికాలో షాకింగ్ ఘటన.. నువ్వు ముస్లిమా అంటూ, భారతీయుడ్ని 15 సార్లు కత్తితో పొడిచి..

Big Stories

Advertisement
×