Twitter Office Closed : ట్విట్టర్లో ఇప్పుడు ఎలాన్ మస్క్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ట్విటర్ను హస్తగతం చేసుకొని వారం కూడా గడవకముందే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ట్విట్టర్ ఆఫీసును తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నామని.. ఉద్యోగులు ఎవరూ ఆఫీస్కు రావద్దని ఇంటర్నల్గా సర్కులర్ను పాస్ చేశారు. కస్టమర్ల డేటా.. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలాన్ మస్క్ వివరణ ఇచ్చినట్లు సమాచారం.
ఉద్యోగుల కోత కూడా తప్పదని ఇప్పటికే అనేక సార్లు చెప్పిన మస్క్.. ఆ ప్రక్రియాను ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కాస్ట్ కటింగ్, అనవసర ఖర్చును తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జారీ చేసిన మెమోలో తెలుపుతోంది ట్విటర్ సంస్థ. ట్విట్టర్లో అనేక ఉన్నత స్థాయి ఆఫీసర్లను ఇప్పటికే తొలగించారు.. వీరిలో మార్కెటింగ్, హెచ్ఆర్, అడ్వర్టయిజింగ్, డిపార్ట్మెంట్కు చెందిన వారు ఉన్నారు.
ఉద్యోగంలో ఉన్న ఎంప్లయిస్ను వర్క్ ఫ్రం హోం చేయించనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. వారానికి 40 గంటలు ఖచ్చితంగా పనిచేసేలా మస్క్ నిబంధనలు పెట్టారట. ట్విటర్ సోషల్ మీడియాను లైట్ తీసుకున్నవారికి ఇప్పుడు మస్క్ సరైన విధంగా బుద్ధచెప్పనున్నారా..? అంటే ఓనని అనిపిస్తంది. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ట్విట్టర్ టాప్లో ఉంది.. దాన్ని ఊహించనంత పైకి మస్క్ తీసుకుపోనున్నారని సాంకేతిక నిపుణుల అభిప్రాయం.