E-Paper
Advertisement

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన యువతి!

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన యువతి!
Advertisement

Acid Bottle: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దాహమేసి మంచి నీళ్లు అనుకుని ఓ యువతి యాసిడ్ తాగింది. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

జ్యూవెలరీ షాప్‌లో దారుణం..

Advertisement

హాపూర్‌లోని అర్జున్ నగర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. ఒక యువతి కొన్ని ఆభరణాలు కొనుగోలు చేయడానికి స్థానిక జ్యువెలరీ షాప్‌నకు వెళ్లింది. నగలు చూస్తున్న సమయంలో ఆమెకు తీవ్రంగా దాహం వేసింది. దీంతో తాగడానికి కొన్ని నీళ్లు ఇవ్వాలని అక్కడి దుకాణదారుడిని కోరింది.

సీల్డ్ బాటిల్‌లో యాసిడ్

Advertisement

ఆభరణాల వ్యాపారి వెంటనే స్పందించి.. పక్కనే ఉన్న ఒక మిఠాయి దుకాణం (స్వీట్ షాప్) నుంచి నీళ్లు తీసుకురావాలని ఓ చిన్న బాలుడిని పంపించాడు. ఆ బాలుడు తెచ్చిన, పూర్తిగా సీల్ చేసి ఉన్న ఒక వాటర్ బాటిల్‌ను ఓపెన్ చేసి యువతికి ఇచ్చారు. దాన్ని మంచి నీళ్లే అనుకుని ఆమె నోట్లో పోసుకుని తాగింది. అంతే.. మరుక్షణమే నోరంతా తీవ్రంగా మండిపోవడంతో గట్టిగా అరుస్తూ బయటకు పరుగెత్తి, ఆ ద్రావణాన్ని ఉమ్మేసింది.

కొనసాగుతున్న విచారణ

బాటిల్‌లో ఉన్నది నీళ్లు కాదని, ప్రమాదకరమైన యాసిడ్ అని గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారింది.

కేసు నమోదు..

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మిఠాయి దుకాణం యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తమ దుకాణానికి సరఫరా అయిన బాటిళ్లలోనే ఆ యాసిడ్ ఉందని, అందులో యాసిడ్ ఉన్న విషయం తనకు అస్సలు తెలియదని అతడు పోలీసులకు తెలిపాడు. దీంతో షాప్‌లోని మిగిలిన బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

Related News

Strait of Hormuz Closed: యుద్ధం తీవ్రతరం.. ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు, హార్ముజ్ జలసంధి మళ్ళీ క్లోజ్

వియత్నాంలో ఘోర ప్రమాదం.. సముద్రంలో బోల్తా పడిన బోటు.. 18 మంది భారతీయ పర్యాటకులు మృతి!

America: అమెరికా టార్గెట్ ఫిక్స్ .. ఈసారి 500 శాతం సుంకాలు, చమురు కొనుగోలు చేసే దేశాలకు

జైలు కూడు వద్దు.. చికెన్, పాస్తా కావాలి.. తీహార్ జైల్లో అమెరికన్ వింత కోరిక!

Trump: అమెరికాకు ఇజ్రాయెల్ హెచ్చరిక.. ట్రంప్‌ను చంపేందుకు మాస్టర్ ప్లాన్ వాళ్లదే

స్పెయిన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. 12 మంది సజీవదహనం

ఇరాన్‌పై అమెరికా భీకర వైమానిక దాడులు.. తొలి రెండు రోజుల్లోనే 14 మంది మృతి, 78 మందికి గాయాలు!

Big Stories

Advertisement
×