E-Paper
Advertisement

సౌదీకి మరో బంగారు పంట.. భారీగా యురేనియం నిక్షేపాలు గుర్తింపు

సౌదీకి మరో బంగారు పంట.. భారీగా యురేనియం నిక్షేపాలు గుర్తింపు
Advertisement

Saudi Arabia: సౌదీ అరేబియాకు పంట పడింది. ఇప్పటికే తరగని చమురు ఉండగా ఇప్పుడు యురేనియం వంతైంది. మదీనాలోని పర్వత ప్రాంతాల్లో భారీ ఎత్తున యురేనియం నిల్వలు బయట పడినట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా స్వయంగా ప్రకటించింది. దాదాపు 110 మిలియన్ టన్నుల ఖనిజం ఉన్నట్లు ఓ అంచనా. దీంతో సౌదీ పంట పండినట్టే.

సౌదీ అరేబియాకు పంట పండింది

కాలం కలిసిరావడమంటే ఇదేనేమో. ఏళ్లుగా తరగని చమురు సంపద సౌదీ సొంతం. ఇప్పుడు యురేనియం కూడా తోడైంది. మదీనా ఏరియాలోని సమీప పర్వత ప్రాంతాల్లో భారీగా యురేనియం నిక్షేపాలను కనుగొన్నాడు అక్కడి అధికారులు. సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ప్రకారం.. మదీనాలోని జబల్ సయ్యద్ ప్రాజెక్టులో నిర్వహించిన భూగర్భ సర్వేలో సుమారు 110 మిలియన్ టన్నులు ఉన్నట్లు గుర్తించారు. అందులో అరుదైన ఖనిజాలతోపాటు యురేనియం ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని అరబ్ న్యూస్ ప్రస్తావించింది.

మదీనా ప్రాంతంలో భారీగా యురేనియం నిక్షేపాలు

Advertisement

యురేనియం, అరుదైన ఖనిజాల ఆవిష్కరణకు సౌదీ అరేబియా సిద్ధమవుతోంది. ప్రపంచంలోని చమురు ఉత్పాదక దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా మైనింగ్, పునరుత్పాదక ఇంధనం, అణు విద్యుత్ వంటి రంగాలలో పెట్టుబడులు పెంచుతోంది. ఈ క్రమంలో దేశీయ యురేనియం వనరులను అన్వేషిస్తోంది. పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తోంది. ఈ సమయంలో మదీనాలో యురేనియం నిల్వలు ఉన్నాయన్న వార్త, అక్కడి పాలకుల్లో ఆనందం రెట్టింపు అయ్యింది.

అమెరికా-సౌదీ మధ్య అణు విద్యుత్‌పై ఒప్పందాలు

అణు విద్యుత్ రంగానికి సంబంధించి సహకారం గురించి అమెరికా- సౌదీ అరేబియా మధ్య ఒప్పందాలు జరిగాయి. అణు విద్యుత్ ఉత్పత్తికి యురేనియం కీలకమైన ముడి సరుకు. దీని నుంచి నేరుగా అణు ఇంధనం ఉత్పత్తి కాదు. అవసరాన్ని బట్టి అనేక దశల ప్రాసెసింగ్ ప్రక్రియ అవసరం. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు యురేనియం అరుదైనవిగా పరిగణిస్తారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, పవన శక్తి, రక్షణ పరికరాలు, హై టెక్ పరిశ్రమలలో దీన్ని వినియోగం ఉంటుంది. మదీనా ప్రాంతంలో కనుగొన్న వనరులను వాణిజ్యపరంగా వెలికి తీయవచ్చని రుజువైతే సౌదీ అరేబియా ఇంధన భద్రతకే కాదు, ఖనిజ-పారిశ్రామిక వ్యూహానికి కేంద్ర బిందువుగా మారనుంది.

Advertisement

ALSO READ: న్యూయార్క్‌ సబ్‌వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. భారత సంతతి మహిళ, ఆమె ఫ్రెండ్‌పై దూసుకెళ్లిన రైలు

ఇస్లాంలో అత్యంత పవిత్రమైన నగరాల్లో మదీనా ఒకటి. ప్రవక్త ముహమ్మద్ క్రీ.శ. 622లో మక్కా నుండి మదీనాకు వలస వెళ్లారు. ఆ తర్వాత మదీనా తొలి ఇస్లామిక్ సమాజానికి ప్రధాన కేంద్రం అయ్యింది. ఈ ప్రాంతం ఇప్పుడు ముఖ్యమైన ఖనిజ వనరులను కనుగొనడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. భద్రత-అణు కార్యక్రమాలపై మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమైన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రాంతీయ అధికార సమతుల్యత సాధించడంలో సౌదీ కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తానికి చమురు మాదిరిగా యురేనియం నిల్వలకు కేరాఫ్‌గా సౌదీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related News

న్యూయార్క్‌ సబ్‌వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. భారత సంతతి మహిళ, ఆమె ఫ్రెండ్‌పై దూసుకెళ్లిన రైలు

బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

Big Stories

Advertisement
×