ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మార్చి 21వ తేదీన జరగాల్సిన ఇంగ్లిష్ పేపర్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ రోజున రంజాన్ పండుగ ఉన్నందున విద్యార్థులు, సిబ్బంది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వాయిదా పడిన ఈ ఇంగ్లిష్ పరీక్షను తిరిగి ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నోటీసు విడుదల చేసింది. షెడ్యూల్లో కేవలం ఇంగ్లిష్ పరీక్ష తేదీ మాత్రమే మారింది. మిగతా సబ్జెక్టుల పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఈ మార్పును గమనించి ఏప్రిల్ 2న జరిగే ఇంగ్లిష్ పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు. హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. కేవలం తేదీ మార్పును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విద్యాశాఖ వెల్లడించింది.
ALSO READ: Tobacco Farmers: పొగాకు రైతుల కష్టానికి న్యాయం ఎక్కడ? లక్షల పెట్టుబడి.. చివరికి మంటల్లో పంట!