E-Paper
Advertisement

TGPSC Group-1: గ్రూప్-1 వివాదం.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన TGPSC

TGPSC Group-1: గ్రూప్-1 వివాదం.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన TGPSC
Advertisement

TGPSC Group-1: తెలంగాణలో గ్రూప్-1 భర్తీ పరీక్షలు ఎప్పటికీ వివాదాలకు గురవుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. విడుదలైన నుంచి మొత్తం వివాదాలే.. తాజాగా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో అక్రమాలు ఆరోపణలు, అభ్యర్థుల ఫిర్యాదులు, సింగిల్ బెంచ్ తీర్పు ఈ వివాదానికి దారితీసింది. ఈ ఘటన రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత, న్యాయం అంశాలను ముందుంచుతోంది. ఈ

గ్రూప్-1 పరీక్షలు రాష్ట్రంలో అత్యంత పోటీతత్వం గలవి. 563 పోస్టులకు లక్షలాది మంది యువకులు పోటీ పడ్డారు. 2023 జూన్‌లో మొదటిసారి ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. అయితే, బయోమెట్రిక్ వెరిఫికేషన్ లోపాలు, GO. 29 ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వంటి ఆరోపణలతో హైకోర్టు సెప్టెంబర్ 23న ఆ పరీక్షను రద్దు చేసింది. డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 27న ఆ తీర్పును సమర్థించింది. ఆ తర్వాత రేవంత్ సర్కార్ గ్రూప్-1 ప్రిిలిమ్స్ పరీక్ష సజావుగా నిర్వహించింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. సుమారు 21 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Advertisement

2025 మార్చి 10న మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 30న సాధారణ మెరిట్ జాబితా విడుదలైంది. కానీ, ఇక్కడే సమస్యలు మొదలయ్యాయి. అభ్యర్థులు మార్కుల విభేదాలు, తెలుగు మీడియం అభ్యర్థులపై అన్యాయం ఆరోపించారు. ఏప్రిల్ 16న ఒక రిట్ పిటిషన్‌లో హైకోర్టు సింగిల్ జడ్జి అపాయింట్‌మెంట్లను ఆపేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అనుమతి ఇచ్చారు.

సెప్టెంబర్ 9, 2025న జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు సింగిల్ బెంచ్ 222 పేజీల తీర్పు ఇచ్చింది. TGPSC పరీక్షలు సజావుగా నిర్వహించలేదని, రిక్రూట్‌మెంట్ నియమాక విధానాన్ని ఉల్లంఘించిందని తేల్చింది. రిక్రూట్మెంట్ ను ఆపాలని ఆదేశించింది. TGPSCకు రెండు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. 1) మెయిన్స్ ఆన్సర్ షీట్లను మాన్యువల్‌గా మోడరేషన్ పద్ధతితో రీ-ఎవాల్యుయేట్ చేసి, 8 వారాల్లో ఫలితాలు ప్రకటించాలి. 2) రీ-ఎవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే, మెయిన్స్ పరీక్షలు 8 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలి అని తెిపింది. ఈ తీర్పు  అభ్యర్థుల్లో ఆశలు, భయాలు రేకెత్తించింది. ఎంపికైనవారు నిరాశతో మునిగిపోయారు. తెలుగు మీడియం అభ్యర్థులు మార్కుల అసమానతలు ఎదుర్కొన్నారని చెప్పారు.

Advertisement

ALSO READ: CM Revanth Reddy: పేదరిక నిర్మూలనకు విద్యే ఏకైక ఆయుధం: సీఎం రేవంత్ రెడ్డి

ఈ తీర్పుపై TGPSC తక్షణమే స్పందించింది. సెప్టెంబర్ 17, 2025న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు తప్పుగా ఉందని, రీ-ఎవాల్యుయేషన్ సాధ్యం కాదని, పరీక్షలు మొత్తం రద్దు చేయడం అభ్యర్థులకు అన్యాయమని వాదిస్తోంది. TGPSC లీగల్ టీమ్ ‘పరీక్షల్లో పారదర్శకత ఉంది, ఎవాల్యుయేటర్లు నిపుణులు, భాషా ఆధారంగా విలువీకరణ జరిగింది’ అంటోంది. ఈ అప్పీల్ విచారణ ఇంకా మొదలవలేదు, కానీ దీనిపై అభ్యర్థులు కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కొందరు సప్రీంకోర్టును కూడా ఆశ్రయించాలని భావిస్తున్నారు.

ALSO READ: Bathukamma Festival: మన హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిఎత్తైన బతుకమ్మ.. రెండు కళ్లు సరిపోవు..

ఈ వివాదం రాష్ట్ర పరిపాలనా సంస్కరణలకు సవాలుగా మారింది. TGPSCపై మునుపటి కమిషన్‌లో అక్రమాలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త కమిషన్ పారదర్శకత చూపించాలని డిమాండ్. అభ్యర్థులు మూడేళ్లుగా కష్టపడి చదువుతున్నారు. రీ-ఎక్సామ్ అంటే మళ్లీ ఆలస్యం, మానసిక ఒత్తిడి. మరోవైపు, రీ-ఎవాల్యుయేషన్‌తో న్యాయం సాధించవచ్చు. ఈ కేసు డివిజన్ బెంచ్ తీర్పు రాష్ట్ర భవిష్యత్ భర్తీలకు మార్గదర్శకంగా మారుతుంది. యువత ఆశలు దెబ్బతినకుండా, న్యాయమైన ప్రక్రియే ఆధారమవ్వాలి. ఈ పోరాటం తెలంగాణ యువజనుల ప్రతి ఆకాంక్షకు ప్రతీకగా నిలుస్తోంది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×