E-Paper
Advertisement

NHM Jobs: ఆ జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, ఇంకా 2 రోజులు మాత్రమే

NHM Jobs: ఆ జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, ఇంకా 2 రోజులు మాత్రమే

నెల్లూరు జిల్లాలో నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పథకంలో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

పోస్టుల వివరాలు ఇవే.. 

వివిధ విభాగాల్లో ఉన్న ఈ ఖాళీలను పరిశీలిస్తే ఆడియోలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ విభాగంలో ఒకటి అలాగే చైల్డ్ సైకాలజిస్ట్ పోస్టు ఒకటి ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ విభాగానికి సంబంధించి రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ కేటగిరీలో ఐదు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ కింద శానిటరీ వర్కర్, కుక్ అలాగే అటెండర్, క్లీనర్ పోస్టులు కలిపి మొత్తం ఐదు ఉన్నాయి. లీగల్ కన్సల్టెంట్ విభాగంలో కూడా ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం ఇదే.. 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు అర్హులు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా సాగుతుంది. ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు అందజేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ

ఆసక్తి గల అభ్యర్థులు కేవలం ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నెల్లూరు. దరఖాస్తు ప్రక్రియ 2026 ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రం లోపు కార్యాలయంలో అందజేయాలి.

గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను అధికారులు పరిగణనలోకి తీసుకోరు. నెల్లూరు జిల్లా వాసులకు ఈ ఉద్యోగ అవకాశాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

అఫీషియల్ వెబ్ సైట్: https://spsnellore.ap.gov.in/

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×