నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ లిమిటెడ్ (RITES Ltd) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ ప్రాజెక్టుల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేందుకు అర్హులైన ఇంజినీరింగ్ నిపుణుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 రెసిడెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ ప్రాజెక్ట్ సైట్లలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
పోస్టుల సంఖ్య: 5
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో ఫుల్ టైమ్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ఎక్స్ పీరియన్స్: విద్యార్హతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను పర్యవేక్షించే సామర్థ్యం ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది.
వయస్సు: అభ్యర్థుల వయసు 2026 ఏప్రిల్ 27 నాటికి 40 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే దివ్యాంగులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీతం: ఎంపికైన వారికి నెలకు రూ.32,492 వేతనంగా చెల్లిస్తారు. ఇది ఒప్పంద కాలపరిమితిని బట్టి మారుతుంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 125 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షను కోల్కతా, గుర్గావ్ కేంద్రాలలో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు అనుకూలమైన కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
దరఖాస్తు విధానం: అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు రైట్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
చివరి తేది: ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి 2026 ఏప్రిల్ 27 చివరి తేదీగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంస్థ వెబ్సైట్ను సందర్శించవచ్చు
అఫీషియల్ వెబ్ సైట్: www.rites.com
ALSO READ: సౌత్ సెంట్రల్ రైల్వేలో 2801 ఉద్యోగాలు.. సెలెక్ట్ అయితే మంచి భవిష్యత్తు, పూర్తి వివరాలివే