E-Paper
Advertisement

Bosch AC: భారత ఏసీ మార్కెట్‌లో సంచలనం.. రంగంలోకి జర్మన్ కంపెనీ.. ఆసియాలోనే ఫస్ట్ టైమ్!

Bosch AC: భారత ఏసీ మార్కెట్‌లో సంచలనం.. రంగంలోకి జర్మన్ కంపెనీ.. ఆసియాలోనే ఫస్ట్ టైమ్!
Advertisement

Bosch AC: జర్మన్ దిగ్గజ సంస్థ బాష్ (Bosch).. భారత ఎయిర్ కండిషనర్ (AC) మార్కెట్లోకి నేరుగా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం Hitachi (హిటాచీ) బ్రాండ్‌తో కొనసాగుతున్న ఈ సంస్థ.. త్వరలో ‘డ్యూయల్ బ్రాండ్’ (Dual brand) వ్యూహాన్ని అనుసరించాలని యోచిస్తోంది. అదే జరిగితే ఒకే కంపెనీ రెండు డిఫరెంట్ పేర్లతో ఏసీలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

సొంత బ్రాండ్‌తో ఎంట్రీ

బాష్ హోమ్ కంఫర్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సుధాకరన్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌లో Bosch బ్రాండ్ పేరుతో ఏసీలను విడుదల చేసే ఆలోచన పరిశీలనలో ఉంది. అదే జరిగితే ఆసియా మార్కెట్లోనే Bosch బ్రాండ్ ఏసీలు రావడం ఇదే తొలిసారి కానుంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ ఏసీలు యూరోప్, ఇతర పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం.

హిటాచీ బ్రాండ్ కొనసాగింపు

Advertisement

అయితే Bosch సొంతంగా ఏసీలను తెచ్చినప్పటికీ.. హిటాచీ (Hitachi) బ్రాండ్ యథావిధిగా భారత్‌లో కొనసాగుతుందని తెలుస్తోంది. గతంలో చేసుకున్న దీర్ఘకాలిక లైసెన్స్ ఒప్పందం కారణంగా హిటాచీ బ్రాండ్ ను సైతం కొనసాగించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని బట్టి చూస్తే భారత మార్కెట్ లో Bosch, Hitachi రెండు బ్రాండ్లూ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది.

2026 కొత్త మోడళ్ల విడుదల

ఇదిలా ఉంటే బాష్ (Bosch) సంస్థ.. భారత్ లో తన హిటాచీ బ్రాండ్ ను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. 2026 సంవత్సరానికి గాను 80కి పైగా కొత్త హిటాచీ ఏసీ మోడళ్లను భారత్‌లో ఆవిష్కరించింది. ఇవి 54 డిగ్రీల తీవ్ర ఎండలోనూ సమర్థవంతంగా గదులను చల్లబరుస్తాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 మోడల్ ఏసీల్లో AI కూలింగ్, ఆక్టా సెన్సార్ టెక్నాలజీ (Octa Sensor Technology), 5 స్టార్ ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి అధునాతన ఫీచర్లను సైతం పొందుపరిచినట్లు తెలిపాయి. ప్రస్తుతం ఈ నయా మోడల్ హిటాచీ ఏసీలు.. యోషి (Yoshi), తౌషి (Toushi), ఐజెన్ (iZen) వంటి సిరీస్‌లలో లభిస్తున్నాయి.

Advertisement

Also Read: Smartphones 2026: మిడ్ రేంజ్ బడ్జెట్లో.. బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్.. ప్రీమియం రేంజ్ ఫీచర్లు భయ్యా!

మార్కెట్ విస్తరణే లక్ష్యం

ప్రస్తుతం భారత ఏసీ మార్కెట్లో హిటాచీకి సింగిల్ డిజిట్ వాటా మాత్రమే ఉంది. దీనిని రాబోయే రోజుల్లో డబుల్ డిజిట్ కు తీసుకెళ్లాలని మాతృసంస్థ బాష్ భావిస్తోంది. వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్ వంటి అగ్రగామి సంస్థలకు పోటీనిస్తూ టాప్-3 స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గత నాలుగేళ్లలో సుమారు రూ.500 కోట్లను పరిశోధన, అభివృద్ధి కోసం వెచ్చించడం గమనార్హం. భవిష్యత్తులో బాష్ బ్రాండ్ పేరుతో భారత్ లో అడుగుపెట్టడం ద్వారా ఏసీ మార్కెట్ లో వాటాను డబుల్ డిజిట్ కు పెంచుకోవాలని కంపెనీ యాజమాన్యం బావిస్తోంది.

Also Read: Budget Smartphones: రూ.20,000 బడ్జెట్‌లో.. తోపు స్మార్ట్ ఫోన్స్ భయ్యా.. ఫీచర్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×