Bank Queue: చిన్న నోట్ల కొరతను తగ్గించాలని ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో గుజరాత్ మెహ్సానాలోని బ్యాంకు ముందు భారీ లైన్లు దర్శనమిస్తున్నాయి. మెహ్సానాలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు వద్ద కొత్త రూ.10 నోట్లు, నాణేల కోసం జనం బారులు తీరారు.
గుజరాత్లోని మెహ్సానాలో బ్యాంకు ముందు జనం భారీ క్యూలు కట్టారు. స్థానిక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ముందు నోట్ల రద్దు సమయంలో నెలల తరబడి బ్యాంకుల ముందు కనిపించిన లైన్లు మరోసారి గుజరాత్ లో కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు కారణం.. కొత్త రూ.10 నోట్ల పంపిణీ అని తెలుస్తోంది. కొత్త రూ.10 నోట్లు పంపిణీ చేపట్టడంతో బ్యాంకు ముందు జనం గుమ్మిగూడారు.
ఆర్బీఐ ఆదేశాల మేరకు కొత్త నోట్లు, చిన్న విలువ నాణేలను జారీ చేయడానికి మెహ్సానాలో బ్యాంకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అయితే బ్యాంకు అంచనాలను మించి జనం వచ్చారు. మంగళవారం ఉదయం నుండే వందలాది మంది లైన్లలో ఉన్నారు. స్థానిక వ్యాపారులకు తక్కువ విలువ కలిగిన కరెన్సీ కొరతను పరిష్కరించడానికి ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ డ్రైవ్ లో బ్యాంకు రూ. 14 లక్షల విలువైన కొత్త రూ. 10 నోట్లు 140 కట్టలను జారీ పంపిణీ చేసింది. రూ. 2, రూ. 5 విలువ కలిగిన దాదాపు రూ. 3 లక్షల విలువైన నాణేలు, రూ. 20 నోట్లు 70 కట్టలను పంపిణీ చేసింది. ప్రతి వినియోగదారుడికి ఒక కట్ట నోట్లతో పాటు నాణేల ప్యాకెట్ను అందజేశారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగింది. రోజువారీ ఖర్చులు, పిల్లల అవసరాలు, వివాహాలు ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని చిన్న నోట్లు, నాణేలు కోసం జనం బ్యాంకుకు క్యూకట్టారు. బ్యాంకు మేనేజర్ ముఖేష్భాయ్ పటేల్ మాట్లాడుతూ.. ఆర్బీఐ సూచనల మేరకు ఈ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు.
Also Read: Ustad Bhagat Singh Release: ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేది అప్పుడే… రిలీజ్ పై బిగ్ అప్డేట్!