Black Sesame : శనిదోషం నుంచి మనుషులను బయటపడేసే సులవైన మార్గం నువ్వులు. మకర సంక్రాంతి రోజు సూర్య దేవుడిని పూజించడం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి రోజు ఎవరైతే నల్లనువ్వులతో శనీశ్వరుని, అలాగే సూర్యభగవానుడిని పూజిస్తే వారిపై ఎలాంటి శని ప్రభావం దోషం ఉండదు.ఈ విధంగా పూజ చేసిన అనంతరం ఆవనూనె, నల్ల నువ్వులు, నువ్వుల లడ్డూలను పేదలకు దానం చేయడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుంది.
వాస్తు నిపుణుల ప్రకారం.. ఓ టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు తీసుకొని.. వాటిని ఓ తెల్ల గుడ్డలో వేసి.. చిన్న మూటలా కట్టి.. ఇంటి పరిసరాల్లోని పవిత్ర ప్రదేశంలో గొయ్యితీసి.. మూటతో సహా కప్పెట్టాలి. దీని వల్ల ఇంట్లో కరవు అనేది తీరిపోతుందని చెబుతున్నారు.
ఒక్కోసారి ఉన్నట్టుండి నలతగా అనిపిస్తుంది. తలనొప్పి లేదా మరోటి తేడాగా ఉన్నట్టు
అనిపిస్తే అది దిష్టిగా భావించవచ్చు. మీపై ఎవరైనా అసూయతో ఉన్నట్లు అనిపిస్తే… ఓ గుడ్డలో కొద్దిగా నల్ల నువ్వులు వేసి.. మూట కట్టి.. ఆ మూటను మీ తల చుట్టూ ఏడుసార్లు తిప్పి.. ఆ మూటను మంటల్లో విసిరేస్తే సమస్య తీరుతుంది.