Blood Cells : తీవ్రమైన గాయాలై రక్తస్రావమైతే… రక్తం ఎక్కించాల్సి వస్తుంది. సికిల్ సెల్ ఎనీమియా ఉండే వారికి తరచూ రక్తమార్పిడి అవసరం అవుతుంది. రక్త దానం కోసం పదే పదే దాతలను వెతుక్కోవాల్సి వస్తుంది. తగిన బ్లడ్ గ్రూప్ దొరకక ఇబ్బందులు తప్పవు. బ్లడ్ బ్యాంకులకు పరుగెత్తాల్సి రావచ్చు. అయితే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను అధిగమించే అవకాశం ఉందంటున్నారు లండన్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన సైంటిస్టులు. ఎందుకంటే వారు ల్యాబరేటరీలో ఎర్ర రక్త కణాలను పెంచారు. వాటితో ప్రయోగాలు చేపట్టిన శాస్త్రవేత్తలు…ఇద్దరు మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేశారు. సాధారణంగా ముందు జంతువులపై ప్రయోగాలు చేసిన తర్వాత మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం పరిపాటి.
దాతల నుంచి సేకరించిన ఎర్రరక్త కణాలు ఎక్కువకాలం ఉంటాయా? ల్యాబరేటరీలో పెంచిన రెడ్ బ్లడ్ సెల్స్ జీవితకాలం ఎక్కువనా అనేది తెలుసుకోడానికి క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. దాతల స్టెమ్ సెల్స్ నుంచి రక్తనాళాల్ని సేకరించి వాటిని ల్యాబరేటరీలో పెంచారు. ఆ తర్వాత వాటిని ఆరోగ్యవంతులైన ఇద్దరు మనుషుల శరీరాల్లోకి ఎక్కించారు. ఈ పరిశోధన సత్ఫలితాలు ఇస్తే… భవిష్యత్తులో తరచూ రక్తం మార్పిడీ చేయాల్సిన వారికి ఇది వరంగా మారనుంది. ఎందుకంటే తక్కువసార్లు రక్తమార్పిడీ చేస్తే సరిపోతుంది అంటారు ఈ పరిశోదనకు నేత్రుత్వం వహించిన సెట్రిక్ గ్రెవెర్డ్ అనే ప్రొఫెసర్. మరోవైపు తరచూ రక్తదాతలను వెతుక్కునే అవసరం కూడా తప్పుతుంది. అంతేకాదు రక్త గ్రహీతలకు ఖర్చు కూడా తగ్గుతుంది.