BigTV English

Mudam Muhurtham : మూఢంలో ముహూర్తం వద్దనేది అందుకే…..!

Mudam Muhurtham : మూఢంలో ముహూర్తం వద్దనేది అందుకే…..!

Mudam Muhurtham : మూడమి ఉంటే పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలు చేయరు. మూఢము అంటే కప్పి ఉంచడం, కనపడకపోవడం.  మానవ జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపేవి గ్రహాలు.  నవ గ్రహాల్లో శుభగ్రహాలు రెండు మాత్రమే ఉన్నాయి. బృహస్పతి, గురుడు మాత్రమే శుభ గ్రహాలు. బృహస్పతి పురుష గ్రహం అంటారు. సుఖాన్ని,సంతోషాన్ని, కోరికలను , ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు.


విద్యను ,జ్ఞానాన్ని , ధర్మ బుద్ధులను, ఉత్తమ ఆలోచనలు కలిగించేవాడు బృహస్పతి. వివాహం చేసేటప్పుడు వాళ్లిద్దరి దృష్టి ఉంటే ఆలుమగలిద్దరూ కలిసి ఉంటారు. పదిమందికి దానం చేస్తారు. పదిమందియోగక్షేమాలు కోరుకునేవారవుతారు. 

వివాహం చేసుకునే వారు మనసులు కలవాలి. పెళ్లైనా ఏడాదికే ఇద్దరూ చెరోదారిలో వెళ్తే వివాహ ప్రయోజనం ఏముంటుంది. ? అలాంటి వారు ఎంత సంపాదించినా లాభం ఉండదు. ఒకరినొకరు ప్రేమించాలంటే, ద్వేషించకుండా ఉండాలంటే ఈ రెండు గ్రహాల చూపు ఉండాలి. లోకక్షేమం కావాలంటే ఈ రెండు బాగుండాలి. అందుకే గురుడు, శుక్రుడు మనల్ని చూస్తున్నప్పుడే వివాహం చేసుకోవాలి.  అవి మనల్ని చూడనప్పుడు మనం వాటిని చూడలేనప్పుడు వివాహాలు చేసుకోకూడదు.  అందుకే మూడంలో గురుమూఢం, శుక్రమూఢం ఉంటాయి. ఈ రెండు కనపడప్పుడు వివాహలు ఆపాలి. మూఢం అనేది ఎక్కువ కాలం ఉండదు.


సంవత్సరంలో రెండు మూడు నెలలు మాత్రమే మూఢం ఉంటుంది.  మీరు బాగుంటే సమాజం బాగుంటుంది. దంపతులు బాగా లేకుండా సమాజం బాగా ఉండదు. సమాజ క్షేమం కోసం శుభగ్రహాలు మనల్ని చూస్తున్నపుడే వివాహాలు చేసుకోవాలి. 

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×