Samantha: హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తాజాగా తన కూతురు జననం గురించి కొన్ని భావోద్వేగమైన విషయాలను బయటపెట్టారు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జే శెట్టి నిర్వహించే పోడ్కాస్ట్లో పాల్గొన్న ప్రియాంక..తన జీవితంలో ఎదురైన కష్టకాలాన్ని వివరించారు. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పిన మాటలకు.. టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు స్పందిస్తూ.. ప్రియాంక చోప్రాణి ప్రశంసించారు.
ప్రియాంక మాట్లాడుతూ, తమ కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్ కేవలం 27 వారాలకే పుట్టిందని తెలిపారు. ఆ సమయంలో మాల్టీ NICUలో చికిత్స పొందిందని, అది తమ జీవితంలో చాలా భయానకమైన.. బాధాకరమైన దశగా మారిందని చెప్పారు. ఆ పరిస్థితుల్లో తాము మానసికంగా పూర్తిగా కుదేలైపోయామని ప్రియాంక చెప్పారు.
ఇంత సున్నితమైన సమయంలోనే, బిడ్డ ఉత్తరం అని వార్త మీడియాకు లీక్ అవుతుందని సమాచారం వచ్చిందని, మూడు గంటల్లో వార్త బయటకు వస్తుందని చెప్పడంతో తాము సిద్ధంగా లేకపోయినా ప్రకటన చేయాల్సి వచ్చిందని ప్రియాంక వెల్లడించారు. “మేము ఇంకా ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాం. అయినా బలవంతంగా ప్రకటన చేయాల్సి వచ్చింది” అని ఆమె చెప్పిన మాటలు చాలామందిని కదిలించాయి.
ఈ వీడియో క్లిప్ను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ, “చాలా అందంగా ఉంది. ధన్యవాదాలు ప్రియాంక. మీరు చాలా నిజాయితీగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది” అని రాసుకొచ్చారు. సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రియాంక .. ఆమె భర్త నిక్ జోనాస్ 2018లో వివాహం చేసుకున్నారు. 2022లో సరోగసీ ద్వారా మాల్టీ జన్మించింది. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉండగా, సమంత కూడా సినిమాలు, వెబ్ సిరీస్లు, నిర్మాణ రంగంలో ముందుకు సాగుతున్నారు.
Also Read: Allu Sirish Nainika wedding: అల్లు స్టూడియోస్ లో అల్లు శిరీష్ నైనిక రిసెప్షన్..ఎప్పుడంటే?