E-Paper
Advertisement

DMHO Jobs: ఆ జిల్లా నిరుద్యోగులకు సువర్ణవకాశం.. నెలకు రూ.36,465 జీతం, రాత పరీక్ష లేకుండానే జాబ్

DMHO Jobs: ఆ జిల్లా నిరుద్యోగులకు సువర్ణవకాశం.. నెలకు రూ.36,465 జీతం, రాత పరీక్ష లేకుండానే జాబ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది శుభవార్త. ప్రభుత్వ పరిధిలోని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK), నేషనల్ హెల్త్ మిషన్ (NHM) లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నారు. వైద్య ఆరోగ్య రంగంలో సేవలు అందించాలనుకునే అర్హత గల అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హత ఉన్న వారు ఈ గోల్డెన్ ఛాన్స్ ను ఉపయోగించుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో పలు కీలక పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సేవలు అందించడానికి ఈ నియామకాలు జరుగుతున్నాయి.

వెకెన్సీ వివరాలు:

మొత్తం 09 ఖాళీలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆడియోలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ విభాగంలో మూడు పోస్టులు, క్లినికల్ సైకాలజిస్ట్ విభాగంలో రెండు పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు డెంటల్ టెక్నీషియన్ రెండు, ఆప్టోమెట్రిస్ట్ ఒకటి, స్టాఫ్ నర్స్ ఒక పోస్టు అందుబాటులో ఉన్నాయి.

వెకెన్సీల సంఖ్య: 9

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి నిర్ణీత విద్యార్హతలు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా లేదా జీఎన్ఎం లేదా డిగ్రీ లేదంటే పీజీ పూర్తి చేసిన వారు అర్హులు అవుతారు.

వయస్సు:

వయోపరిమితి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లు మించకూడదు.

జీతం:

ఎంపికైన వారికి నెలకు గౌరవప్రదమైన వేతనం అందుతుంది. ఆడియోలజిస్ట్ పోస్టుకు నెలకు రూ.36,465 చెల్లిస్తారు. క్లినికల్ సైకాలజిస్ట్ కు రూ. 33,075 అలాగే ఆప్టోమెట్రిస్ట్ కు రూ. 29,549 వేతనంగా లభిస్తుంది. స్టాఫ్ నర్స్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.27,675 చెల్లిస్తుండగా డెంటల్ టెక్నీషియన్ కు రూ. 21,879 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:

ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. అభ్యర్థులు తమ విద్యా అర్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ఉండటం గమనార్హం.

దరఖాస్తు విధానం:

ఆసక్తి గల వారు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను అవసరమైన ధృవపత్రాలతో జతచేసి కాకినాడ జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 11, 2026 వరకు అవకాశం కల్పించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.

చివరి తేది: మార్చి 11

అఫీషియల్ వెబ్ సైట్: https://eastgodavari.ap.gov.in/

ALSO READ: SVIMS Recruitment: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు.. నెలకు రూ.60వేల జీతం, విద్యార్హత ఇదే..

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×