BigTV English

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కేజ్రీవాల్ బెయిల్ పై నేడే సుప్రీం కోర్టు తీర్పు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తన అరెస్టుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం, జూలై 12న తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెలువరిస్తుందని.. కోర్టు వెబ్ సైట్ పై ప్రకటన చేయబడింది.

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కేజ్రీవాల్ బెయిల్ పై నేడే సుప్రీం కోర్టు తీర్పు

Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తన అరెస్టుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం, జూలై 12న తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెలువరిస్తుందని.. కోర్టు వెబ్ సైట్ పై ప్రకటన చేయబడింది.


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21, 2024న అరెస్టు చేసింది. అయితే తనను ఈడీ అరెస్టు చేయడం.. చట్ట వ్యతిరేకమని చెబుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. కానీ హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించడంతో.. కేజ్రీవాల్.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఏప్రిల్ 9, 2024న సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.

ఈ కేసులో ఇరు పక్షాల వాదన విన్న తరువాత మే 17, 2024న జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.


Also Read: మాజీ అగ్నివీర్ జవాన్లకు పారామిలిటరీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్!

మరోవైపు కేజ్రీవాల్ ఈ కేసులో బెయిల్ కోరుతూ ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. జూన్ 20, 2024న ట్రయల్ కోర్టు లక్ష రూపాయల పూచీకత్తుపై కేజ్రీవాల్ కు బెయిల్ ముంజూరు చేసింది. కానీ కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడంపై ఈడీ అధికారులు మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టులో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేశారు.

జూన్ 25న కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో ఆయన ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నారు.

Also Read:  జైలులో నటుడు దర్శన్‌కు కష్టాలు, పవిత్రగౌడ కంటతడి..

ఆ తరువాత సిబిఐ అధికారులు.. కేజ్రీవాల్ ను జూన్ 26న ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి ఆరోపణలు చేస్తూ.. తమ కస్టడీలోకి తీసుకున్నారు.

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్ , ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2021-22లో రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. కానీ ఈ పాలసీ ద్వారా కేజ్రీవాల్, ఇతర మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఢిల్లీ గవర్నర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Related News

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×