E-Paper
Advertisement

Glowing Skin Tips: మీ ముఖం చందమామలా మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి

Glowing Skin Tips: మీ ముఖం చందమామలా మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి

Glowing Skin Tips: మహిళలు తమ ముఖంపై మెరుపు కోసం వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కొంతమంది పార్లర్‌లో ఖరీదైన ఫేషియల్స్ కూడా చేయించుకుంటారు. ప్రతి ఒక్కరూ మృదువైన, మెరిసే చర్మాన్ని ఇష్టపడతారు. చర్మం అందంగా మెరిసిపోవడానికి పోషకాహారం కూడా అవసరం. ఇదే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం.. సహజమైన స్కిర్ కేర్ ఉత్పత్తులు కూడా ఉపయోగపడతాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా ముఖంపై మచ్చలను కూడా తొలగిస్తాయి. మరి ఎలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ చర్మ సౌందర్యం కోసం ఉపయోగించాలి. వీటి ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది:
పెరుగు చర్మంపై సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పెరుగును తరుచుగా వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా పెరుగు సహాయంతో మీరు ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత పెరుగులో కాస్త బియ్యం పిండి, పసుపు కలిపి స్క్రబ్ చేయాలి. మసాజ్ కోసం పెరుగులో తేనె లేదా అలోవెరా జెల్ మిక్స్ చేసి వృత్తాకారంలో మసాజ్ చేయాలి. చివరగా పెరుగు, చందనం కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి.

అలోవెరా జెల్ మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది:
అలోవెరా జెల్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ముఖంపై రక్షిత పొరను ఏర్పరుస్తుంది. ముందుగా అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుని శుభ్రం చేసుకోవాలి. తర్వాత కాస్త అలోవెరా జెల్‌లో ఓట్స్‌ పౌడర్‌ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత దీనితో ముఖాన్ని స్క్రబ్ చేయండి. మసాజ్ కోసం అలోవెరా జెల్‌లో దోసకాయ రసాన్ని కూడా వాడుకోవచ్చు. కలబంద జెల్‌లో రోజ్ వాటర్ , విటమిన్ ఇ కూడా కలుపుకోవచ్చు.

Also Read: పొరపాటున కూడా.. అమ్మాయిలు ఈ 5 వస్తువులను వాడకూడదు తెలుసా ?

పచ్చి పాలతో ఫేషియల్ చేయండి:
పచ్చి పాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. శుభ్రమైన ముఖంపై ఒక చెంచా పచ్చి పాలను అప్లై చేసి, ఆపై కాటన్ సహాయంతో శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఫేషియల్ చేయడానికి, కాస్త పచ్చి పాలలో శనగపిండిని కలిపి స్క్రబ్ చేయాలి. ఇందులో అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఒక చెంచా పచ్చి పాలలో ముల్తానీ మిట్టి, తేనె , రోజ్ వాటర్ కలిపి కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×