E-Paper
Advertisement

TTD Staff Suspended: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ దొరికిన టీటీడీ సిబ్బంది.. ఇద్దరిపై వేటు

TTD Staff Suspended: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ దొరికిన టీటీడీ సిబ్బంది.. ఇద్దరిపై వేటు
Advertisement

TTD Staff Suspended: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలిపిరి మెట్ల నుంచి కొండ పై వరకు నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగుతుంది. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై అన్ని నిబంధనలు తెలిసిన టీటీడీ సిబ్బందే అపచారం చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో ఇద్దరు టీటీడీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాంసాహారం తింటుండగా భక్తులు ప్రశ్నించారు. ఆ సిబ్బంది తప్పు ఒప్పుకోకపోగా.. తిరిగి బెదిరింపు ధోరణిలో వ్యవహరించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం టీటీడీ అధికారులకు తెలియడంతో ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై వేటు వేశారు.

ఇద్దరు సిబ్బందిపై వేటు

అలిపిరి మార్గంలో నాన్ వెబ్ తిన్నారన్న ఆరోపణలతో ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టీటీడీ తెలిపింది. ఈ విషయంపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నందుకు ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రామస్వామి, సరసమ్మపై కఠిన చర్యలు తీసుకున్నామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. టీటీడీ ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 114 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

నాన్ వెజ్, మద్యం, పొగాకుపై నిషేధం

Advertisement

టీటీడీ నిబంధనల మేరకు తిరుమల పరిధిలో మాంసాహారం, మద్యం లేదా పొగాకు వినియోగం పూర్తిగా నిషేధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని టీటీడీ స్పష్టం చేసింది. తాజాగా అలిపిరి సమీపంలో ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించి నాన్ వెజ్ భోజనం చేయడం కలకలం రేపింది. దీంతో టీటీడీ నిఘాపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల నుంచి ఫిర్యాదు రాగానే టీటీడీ చర్యలు చేపట్టింది. ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరమల కొండ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడటానికి టీటీడీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Also Read: KA Paul: వార్తల్లోకి కే‌ఏ పాల్.. సుప్రీంకోర్టు గరంగరం, ఏం జరిగింది?

ఇలాంటి ఘటనలే

అలిపిరిలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కొంత మంది భక్తులు తిరుమలకు మాంసాహారాన్ని తీసుకొచ్చి తింటూ దొరికిపోయారు. మార్చిలో ఇద్దరు వ్యాపారులు మద్యం, గంజాయి తిరుమలకు తరలిస్తూ పట్టుబడ్డారు. అప్పటి నుంచి టీటీడీ అధికారులు అలిపిరి వద్ద తనిఖీలను ముమ్మరం చేసి భద్రతా చర్యలను పటిష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడడానికి శాఖాహారం, కొన్ని రకాల పదార్థాలను మాత్రమే టీటీడీ కొండపైకి అనుమతిస్తుంది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×