BigTV English

Biyyam vadiyalu: బియ్యం వడియాలు ఇలా పెట్టుకుంటే ఏడాదంతా వస్తాయి.. సాంబారు పెరుగన్నంతో సైడ్ డిష్‌లా అదిరిపోతాయి

Biyyam vadiyalu: బియ్యం వడియాలు ఇలా పెట్టుకుంటే ఏడాదంతా వస్తాయి.. సాంబారు పెరుగన్నంతో సైడ్ డిష్‌లా అదిరిపోతాయి
Biyyam vadiyalu: తెలుగువారికి పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు అంటే ఎంతో ప్రీతి. ఎక్కువ మంది వీటిని ఇప్పుడు కొనేసుకుంటున్నారు. నిజానికి ఇంట్లో చాలా సులువుగా పెట్టొచ్చు. ఇక ఎండ బాగా కాసిందంటే రెండు రోజుల్లో వడియాలైనా, అప్పడాలైనా ఇట్టే ఎండిపోతాయి. ఒక్కసారి చేసుకుంటే ఏడాది పాటు వీటిని తినవచ్చు. ఇక్కడ మేము సింపుల్‌గా చేసే బియ్యం వడియాలు రెసిపీ ఇచ్చాము. సాంబార్ అన్నం, పెరుగన్నం తినేటప్పుడు వీటిని నూనెలో వేయించుకొని తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి వీటి రెసిపీ తెలుసుకోండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మీ బంధువులకు కూడా వీటిని చేసి ఇవ్వవచ్చు.


బియ్యం వడియాలు రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యం – మూడు కప్పులు
నీరు – తొమ్మిది కప్పులు
వాము – ఒక స్పూను
జీలకర్ర – రెండు స్పూన్లు
నువ్వులు – పావు కప్పు
ఉప్పు – రుచికి సరిపడా

బియ్యం వడియాలు రెసిపీ
1. బియ్యం వడియాలు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీరు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి.
2. అంటే ఇక్కడ మనం మూడు కప్పుల బియ్యం తీసుకున్నాము. కాబట్టి తొమ్మిది కప్పుల నీటిని వేసి ఉడికించాలి.
3. నీళ్లు బాగా మరిగాక అప్పుడు బియ్యాన్ని ఆ నీళ్లల్లో వేయాలి.
4. నీళ్లల్లో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
5. అలాగే వాము, జీలకర్ర, నువ్వులు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. బియ్యము, నీళ్లు అన్ని కలిపి చిక్కగా, గట్టిగా, మందంగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.7.  ఇప్పుడు ఒక చీరను ఎండ తగిలే ప్రాంతంలో పరచాలి.
8. ఈ బియ్యం మిశ్రమాన్ని ఒడియాల్లాగా వేసుకోవాలి.
9. జంతికల గొట్టంలో ఈ మిశ్రమాన్ని వేసి జంతికల్లాగా ఆకారం వచ్చేలా ఎండబెట్టుకోవచ్చు. లేదా మీకు నచ్చిన ఆకారంలో వీటిని వడియాల్లా చేసి ఎండబెట్టుకోవచ్చు.
10. కొంతమంది పల్చగా అప్పడాల్లాగా కాటన్ క్లాత్ పై పరుస్తారు.
11. అలా చేసినా కూడా ఇవి టేస్టీ గానే ఉంటాయి. వీటిని ఎర్రటి ఎండలో రెండు రోజులు ఎండ పెడితే చాలు బాగా ఎండిపోతాయి.
12. ఒక గిన్నెలో వేస్తే ఈ ఎండిన వడియాలు గలగల శబ్దం వచ్చేలా ఉండాలి. అప్పుడే అవి బాగా ఎండినట్టు.
13. వీటిని గాలి చొరబడిన డబ్బాలో వేసి దాచుకుంటే ఎన్ని నెలలైనా తాజాగా ఉంటాయి.

ఇవి ఒకసారి చేసుకుంటే ఆరు నెలలపాటు లోపే వీటిని తినేయడం ఉత్తమం. ఆ తర్వాత కొన్నిసార్లు తాజాగా ఉంటాయి. కొన్నిసార్లు కాస్త పాతవిలా కూడా అనిపించవచ్చు. కాబట్టి బియ్యం వడియాలను చేసిన ఆరు నెలల లోపు తినేందుకు ప్రయత్నించండి. ఇవి తింటున్న కొద్ది ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి. క్రిస్పీగా, క్రంచిగా ఉంటాయి. స్పైసీ పప్పన్నము, సాంబార్ రైస్, బిసీ బెలా బాత్, పెరుగన్నము వంటివి తింటున్నప్పుడు పక్కన  బియ్యం వడియాలు ఉంటే ఇంకా టేస్టీగా ఉంటాయి.


Related News

Eye Care: కంటి సమస్యలు రాకూడదంటే.. ఎలాంటి టిప్స్ పాటించాలి ?

Get Rid of Pimples: మొటిమలు త్వరగా తగ్గాలంటే ?

Warm Water: ఉదయం పూట గోరు వెచ్చని నీరు తాగితే.. ?

Nail Biting: తరచూ గోళ్లు కొరుకుతున్నారా ? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే !

Causes Of Anger: ప్రతి చిన్న విషయానికీ కోపం వస్తుందా.. ? కారణాలివే !

Longtime Sitting: ఆఫీసులో ఎనిమిది నుంచి పది గంటలు కూర్చుంటున్నారా? అయితే ఈ వ్యాధి త్వరలోనే వచ్చేస్తుంది

Big Stories

×