E-Paper
Advertisement

Vitamin D: చర్మానికి నూనె పట్టిస్తే విటమిన్ డి పెరుగుతుందా? ఇందులో నిజమెంత ?

Vitamin D: చర్మానికి నూనె పట్టిస్తే విటమిన్ డి పెరుగుతుందా? ఇందులో నిజమెంత ?
Advertisement

Vitamin D: మన పూర్వీకులు పాటించిన ‘అభ్యంగన స్నానం’ లేదా ఒంటికి నూనె పట్టించడం అనే సంప్రదాయం వెనక లోతైన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. సాధారణంగా సూర్యరశ్మి ద్వారా మనకు విటమిన్ డి లభిస్తుందని అందరికీ తెలుసు. కానీ చర్మానికి నూనె రాసుకోవడం వల్ల ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని చాలా మందికి తెలియదు. విటమిన్ డి అనేది మన ఎముకల బలానికి, రోగ నిరోధక శక్తికి అత్యంత కీలకం. శరీరానికి నూనె రాయడం , విటమిన్ డి స్థాయిల మధ్య ఉన్న శాస్త్రీయ సంబంధాన్ని, మీరు తెలుసుకోవాల్సిన మూడు ముఖ్యమైన వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. నూనె ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది:
చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకుని ఎండలో కూర్చుంటారు. కానీ అవి విటమిన్ డి ఉత్పత్తిని అడ్డుకుంటాయి. దానికి బదులుగా, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వంటి సహజ సిద్ధమైన నూనెలను రాసుకోవడం వల్ల చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది. నూనె రాయడం వల్ల చర్మంపై సూర్యకాంతి పరావర్తనం చెందకుండా.. చర్మపు లోపలి పొరల్లోకి చొచ్చుకుపోయేలా చేస్తుంది. ఇది విటమిన్ డి సంశ్లేషణను మెరుగు పరుస్తుంది.

Advertisement

2. నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ పాత్ర:
విటమిన్ డి అనేది ఒక ‘ఫ్యాట్ సొల్యూబుల్’ (కొవ్వులో కరిగే) విటమిన్. చర్మానికి నూనె రాసి మసాజ్ చేసినప్పుడు, చర్మంపై ఉన్న సెబమ్ (సహజ నూనెలు) సూర్యరశ్మిలోని UV-B కిరణాలతో చర్య జరుపుతాయి. ఈ ప్రక్రియలో 7-డీహైడ్రో కొలెస్ట్రాల్ అనే పదార్థం.. విటమిన్ డి3 గా మారుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. నువ్వుల నూనెలో ఉండే పోషకాలు సూర్యరశ్మిని గ్రహించే శక్తిని చర్మానికి కలిగిస్తాయి.

3. మసాజ్ వల్ల పెరిగే రక్త ప్రసరణ:
కేవలం నూనె పూయడమే కాకుండా.. శరీరానికి మసాజ్ చేయడం వల్ల చర్మం కింద ఉన్న రక్త నాళాలు వ్యాకోచిస్తాయి. రక్త ప్రసరణ పెరగడం వల్ల చర్మంలో తయారైన విటమిన్ డి వేగంగా రక్త ప్రవాహంలోకి చేరుతుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా ఎముకలకు చేరుకోవడానికి సహాయ పడుతుంది.

Advertisement

Also Read: సక్సెస్ ఫుల్ పీపుల్ ఉదయాన్నే చేసే.. ఆ 4 పనులు ఇవే!

ఎలా పాటించాలి ?
సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఉండే ఎండ విటమిన్ డి ఉత్పత్తికి ఉత్తమం. అయితే.. వేసవిలో అయితే ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఎండ సరి పోతుంది.

ఎలా రాయాలి: నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను గోరు వెచ్చగా చేసి శరీరం అంతా మసాజ్ చేయాలి.

వ్యవధి: నూనె రాసుకున్న తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండ తగిలేలా చూసుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.

 

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×