Masala Rice:రోజు రెగ్యులర్గా, రొటీన్గా అవే మళ్లీ మళ్లీ వండి బోర్ కొట్టేస్తుందా?అయితే ఇడ్లీ, దోశ, చపాతీ చేసి విసుగు వస్తుందా?అయితే మీకోసం ఈరోజు సరికొత్తగా, చాలా ఈజీగా అయిపోయే మసాలా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
స్కూల్కి వెళ్లే పిల్లలే కాకుండా, ఆఫీస్లకు వెళ్లే వాళ్లు కూడా టిఫిన్ బాక్స్లో తీసుకెళ్లేందుకు ఇది బెస్ట్ ఆప్షన్.
ముందుగా బియ్యం ఉడికించుకుని అన్నాన్ని విడిగా ఉండేలా సిద్ధం చేసుకోవాలి.ఇంట్లో మిగిలిన అన్నం ఉంటే అదే వాడినా సరిపోతుంది.
ఇప్పుడు ఒక బాణలిలో నెయ్యి వేసి వేడి అయ్యాక జీలకర్ర వేయాలి.వెంటనే ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి బాగా మెత్తబడే వరకు ఉడికించాలి.
ఇప్పుడు కారం పొడి, మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.తర్వాత పెసరపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పప్పు ఉడికే వరకు మూత పెట్టాలి.పప్పు పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉంటేనే రుచి ఇంకా బాగుంటుంది.
ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసి మెల్లగా కలపాలి.అన్నానికి మసాలా మొత్తం బాగా పట్టేలా రెండు మూడు నిమిషాలు సన్నని మంటపై వేయించాలి.చివరగా కొత్తిమీర చల్లితే వేడి వేడి మసాలా రైస్ రెడీ.
ఈ మసాలా రైస్ స్కూల్కి వెళ్లే పిల్లలకు, ఆఫీస్కి వెళ్లే వాళ్లకు బెస్ట్ ఆప్షన్.ఉదయం త్వరగా అయిపోతుంది. మధ్యాహ్నం వరకు కూడా టేస్ట్ అలాగే ఉంటుంది.పెరుగు, రైతా లేదా అప్పడంతో తింటే మరింత బాగుంటుంది.
కొద్దిగా జీడిపప్పు, వేరుశెనగలు వేయించి కలిపితే క్రంచీ టేస్ట్ వస్తుంది.క్యారెట్, బఠానీ, బీన్స్ లాంటి కూరగాయలు కూడా వేసుకోవచ్చు.చివర్లో కొద్దిగా నిమ్మరసం పిండితే ఫ్లేవర్ మరింత పెరుగుతుంది.
రోజూ ఒకే రకం టిఫిన్లతో బోర్ కొట్టేస్తే.. ఈసారి ఈ మసాలా రైస్ ట్రై చేయండి.తక్కువ సమయంలో రెడీ అవుతుంది.. రుచి కూడా అదిరిపోతుంది.మరి మీరూ ఒకసారి ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా!
also read:ఉదయం గంటలో బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎలా రెడీ చేయాలి?..