E-Paper
Advertisement

మామిడి పళ్లను తినే ముందు నీళ్లో నానబెట్టడం తప్పనిసరి.. డాక్టర్లు చెప్పిన కారణాలు ఇవే

మామిడి పళ్లను తినే ముందు నీళ్లో నానబెట్టడం తప్పనిసరి.. డాక్టర్లు చెప్పిన కారణాలు ఇవే
Advertisement

మామిడి పండ్లకే రాజు. మామిడి పండుని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వేసవిలో మామిడి పళ్ల సీజన్ రాగానే మిగతా ఫ్రూట్స్ వదిలి దీన్నే కొనుగోలు చేస్తారు. మామిడి పండు తీయని రుచితో పాటు అవి తీపి, పోషకాలు నిండుగా ఉంటాయి.
అయితే ఆరోగ్య నిపుణులు మామిడి పళ్లను తినే ముందు కొంతసేపు నీళ్లలో నానబెట్టి తినాలని సూచిస్తున్నారు. ఈ చిన్న అలవాటు మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ప్రతీక్ శర్మ తెలిపారు.

మామిడి పళ్లు నానబెట్టడం వల్ల ప్రయోగజనాలు

మామిడి పళ్లపై దుమ్ము, జిగురు, పురుగు మందుల అవశేషాలు ఉండవచ్చు. పండించిన తర్వాత కూడా ఈ పదార్థాలు ఉపరితలంపైనే ఉంటాయి. నానబెట్టడం వల్ల ఈ హానికరమైన అంశాలు సమర్థవంతంగా తొలగిపోతాయి. శుభ్రమైన పండు తినడం వల్ల చికాకు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. సాధారణంగా కడగడం మాత్రమే సరిపోదు. నానబెట్టడం వల్ల మామిడి పళ్లపై ఉన్న అన్ని అవశేషాలు శుభ్రమైపోతాయి.

శరీరంలో వేడిని తగ్గిస్తుంది

Advertisement

మామిడి పళ్లు వేసవిలో శరీర వేడిని పెంచే ఫలాలుగా పరిగణించబడతాయి. నేరుగా తినడం వల్ల కొంత వేడి పెరగవచ్చు. నానబెట్టడం వల్ల ఆ వేడి గుణాలు తగ్గుతాయి. వేడి వాతావరణంలో జీర్ణం చేసుకోవడం సులభం అవుతుంది. మొటిమలు, అసౌకర్యం వంటి సమస్యలు రాకుండా చూస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

మామిడి పళ్లలో కొన్ని సహజ కాంపౌండ్స్ జీర్ణక్రియను ప్రభావితం చేయవచ్చు. ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీ న్యూట్రియెంట్.. ఖనిజాల శోషణకు అడ్డుకుంటాయి. నానబెట్టడం వల్ల ఈ కాంపౌండ్స్ గణనీయంగా తగ్గుతాయి. శరీరం పోషకాలను బాగా గ్రహిస్తుంది. కడుపులో ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

అలర్జీల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

Advertisement

మామిడి కాండం దగ్గర ఒక ఆంటు పదార్థం ఉంటుంది. ఇది కొందరికి చికాకు, దురద లేదా గొంతు అసౌకర్యం కలిగించవచ్చు. నానబెట్టడం ఈ ఆంటును తొలగిపోతుంది. అప్పుడు తినడానికి సురక్షితంగా ఉంటుంది. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం.

మామిడి పళ్లు మరింత హైడ్రేటింగ్‌గా మారతాయి

నానబెట్టిన మామిడి కొంత నీటిని గ్రహిస్తుంది. దీని వల్ల హైడ్రేషన్ స్థాయి పెరుగుతుంది. వేసవిలో చల్లగా, రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. హైడ్రేటింగ్ ఆహారాలు వేడి వాతావరణంలో శరీరానికి ఎక్కువ మద్దతు ఇస్తాయి.

రుచిని పెంచుతుంది

నానబెట్టడం వల్ల మామిడి కొంచెం మెత్తబడి మరింత రసవత్తరంగా మారుతుంది. చాలా మంది నానబెట్టిన మామిడి పండు రుచి మరింత బాగుంటుందని చెబుతారు. తినడం కూడా సులభం అవుతుంది.

ఎంత సేపు నానబెట్టాలి?

నిపుణులు సుమారు 30 నిమిషాలు నానబెట్టాలని సూచిస్తున్నారు. కొంత సమయం నానబెట్టినా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. వేడి నీటిని ఉపయోగించకండి. వేడి నీరు పోషకాలు తగ్గించవచ్చు.

Also Read: వేసవిలో గోంద్ కటిరా తింటున్నారా? ఈ సమస్యలున్నవారు అసలు తినకూడదు

ఏ విధంగా నానబెట్టాలి?

ముందు మామిడి పళ్లను తేలికగా కడగండి. శుభ్రమైన నీటితో నిండిన గిన్నెలో పెట్టి 30 నిమిషాలు నానబెట్టండి. ఆ తరువాత తొక్క తొలగించి ఆనందంగా తినండి.

Related News

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

Big Stories

Advertisement
×