Rajinikanth:సాధారణంగా కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని.. విడుదల కావాల్సిన సమయంలో కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడుతూ ఉంటాయి. కానీ అనుకోని సందర్భాలలో మళ్ళీ సడన్గా థియేటర్లలోకి వస్తే మాత్రం అభిమానులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో హీరో విశాల్ (Vishal) హీరోగా నటించిన ‘మదగజ రాజా’ ఏకంగా 12 ఏళ్ల తర్వాత విడుదలై థియేటర్లలో మంచి విజయం సాధించింది . అయితే ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా దాదాపు 37 ఏళ్ల క్రితం నటించిన ఒక సినిమా విడుదలకు నోచుకోలేదు. కానీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ చిత్రం ఏమిటి? ఎందుకు ఇన్ని రోజులు ఆగిపోయింది? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
1989లోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక బాలీవుడ్ యాక్షన్ ఫిలింలో నటించారు . షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది ఆ సినిమా.. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా తెరపైకి రాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా 4K టెక్నాలజీతో.. ఏఐ ని ఉపయోగించి థియేటర్లలోకి రావడానికి సిద్ధమయ్యింది ముఖ్యంగా టాప్ స్టార్ లందరూ ఇందులోనే నటించారు. మరి అలాంటి ఈ సినిమా విడుదలకు ఇన్నేళ్లు పట్టడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి ఆ చిత్రం ఏదో కాదు “హమ్ మీన్ షాహేన్ షా కౌన్”. ప్రముఖ నిర్మాత రాజా రాయ్ అప్పట్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రజినీకాంత్ తో పాటు హేమమాలిని, అనితా రాజ్ , ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా, శత్రుజ్ఞ సిన్హా, అమ్రీష్ పూరి, జగదీప్ లాంటి తదితరులు నటించారు.
also read:Hyper Aadi: “ఐడియల్ భర్త”.. అలాంటి లక్షణాలు కావాలంటున్న హైపర్ ఆది!
ఇక్కడ మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన హర్మేష్ మల్హోత్రాతో పాటు విలక్షణ నటుడు అమ్రిష్ పూరి , హాస్యనటుడు జగదీప్, కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వంటి దిగ్గజాలు మన మధ్య లేకపోవడం గమనార్హం.ఇకపోతే దాదాపు 37 ఏళ్లుగా వాయిదా పడ్డ ఈ సినిమా ఎందుకు విడుదల కాలేదనే విషయానికి వస్తే..వ్యక్తిగత కారణాలే అని తెలుస్తోంది.నిర్మాత రాజా రాయ్ తన వ్యాపార పనిపై లండన్ వెళ్లిపోయారట. అక్కడ ఆయన చిన్న కుమారుడు అకస్మాత్తుగా మరణించడంతోనే తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆయన ఆ సినిమాను మళ్ళీ పట్టించుకోలేదు. అయితే కొంతకాలం ఆ బాధలోనే ఉన్న ఆయన మళ్లీ సినిమాను విడుదల చేద్దామని అనుకుంటున్న సమయంలో దర్శకుడు హర్మేశ్ మల్హోత్రా కన్నుమూశారు. అదొక విషాదఘటన.ఇలా వరుసగా విషాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలోనే ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఇన్నేళ్ళకు సహ నిర్మాత అస్లాం మిర్జా సహాయంతో పిక్చర్ క్వాలిటీ కోసం 4k టెక్నాలజీని.. ఆడియో నాణ్యత కోసం ఏ ఐ టెక్నాలజీని ఉపయోగించి కథలో మార్పులు చేయకుండా ఆ కాలంనాటి కలర్ విజువల్స్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన అఫీషియల్ డేట్ ను కూడా త్వరలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇన్నేళ్ల తర్వాత రజనీకాంత్ నటించిన ఈ సినిమా విడుదల కాబోతుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఇక అలాగే మరొకవైపు రజినీకాంత్ జైలర్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమలహాసన్ నిర్మిస్తున్న తలైవార్ 176 సినిమా షూటింగ్లో బిజీగా కానున్నారు.