Akash Puri-Josh Ravi: యంగ్ హీరో, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి పెద్ద మనసు చాటుకున్నారు. తండ్రిని కోల్పోయి దు:ఖంలో ఉన్న ‘జోష్’ని రవికి అండగ నిలిచారు. ఏపీలో పశ్చిమ గోదావరిలోని ఆయన స్వగ్రామం మార్టేరుకు స్వయంగా వెళ్లి మరి పరామర్శించారు. నిన్న రవి ఇంటికి వెళ్లిన ఆకాశ్ పూరి అతడిని చూడగానే ఆలింగనం చేసుకుని న్న సాయంత్రం వెళ్లి రవిని ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు.
అనంతరం జోష్ రవి తల్లిని ఓదార్చారు. ఆ తర్వాత వారితో కాసేపు మాట్లాడాడు. కష్టసమయంలోనే ధైర్యంగా ఉండాలని, ఎప్పుడు ఏం అవసరం ఉన్న సాయం చేస్తానంటూ వారికి హామీ ఇచ్చారు. తర్వాత రవి తండ్రి ఫోటో వద్ద నివాళులు అర్పించారు. ఇందుకు సంబంబధించిన వీడియోని స్వయంగా రవి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆకాశ్ పూరి ఉదారత నెటిజన్స్, ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Also Read: Chikiri Chikiri Song Record: రిలీజ్ కి ముందే పెద్ది రికార్డు.. 100 మిలియన్లు దాటేసిన చికిరి
అతడి మంచి మనసుని కొనియాడుతూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. కాగా ఇటీవలే జోష్ రవి తండ్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరిలోని మార్టేరు గ్రామంలోని రవి తండ్రి అంత్యక్రియలు జరిగాయి.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==