Premabhishekam Film:తెలుగు చిత్ర పరిశ్రమకి మూల స్తంభాల్లాంటి వ్యక్తులలో ఒకరిగా నిలిచిన ఏఎన్ఆర్ (అక్కినేని నాగేశ్వరరావు) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నట సామ్రాట్ గా పేరు దక్కించుకున్న అక్కినేని నాగేశ్వరరావు.. నేడు మన మధ్య లేకపోయినా ఆయన చిత్రాలు మాత్రం ఆయనను సజీవంగా గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన సినీ కెరియర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాలలో ‘ప్రేమాభిషేకం’ ఒకటి. కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా అప్పట్లో ఒక సంచలనం సృష్టించిన చిత్రం ఇది. ఈ సినిమా విడుదల అయ్యి నేటికీ 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ స్పెషల్ వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అక్కినేని నాగేశ్వరరావుకి ఘన నివాళి అర్పించింది.
ప్రేమాభిషేకం సినిమా విషయానికి వస్తే.. 1981 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ సినిమా అప్పట్లో అనేక కేంద్రాలలో సుమారుగా 365 రోజులకు పైగా ప్రదర్శితమై సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక తెలుగు సినిమా ఇన్ని థియేటర్లలో షిఫ్టులు లేకుండా సుమారుగా ఏడాది పాటు ఆడడం అంటే అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ సినిమాలో ఏఎన్ఆర్ ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడిగా, అమర్ ప్రేమికుడిగా , ప్రేక్షకుల గుండెలను పిండేశారు. శ్రీదేవి, జయసుధ నటన ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.
ముఖ్యంగా ఈ సినిమా ఒక ఎవర్గ్రీన్ అంటే.. ఈ సినిమాలోని పాటలు అంతకుమించి అనే చెప్పాలి.” దేవీ మౌనమా.. శ్రీదేవి మౌనమా.. నీకై తపించి”.., “నా కళ్ళు చెబుతున్నాయి.. నిన్ను ప్రేమించానని.. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని”.., “వందనం. అభివందనం” వంటి పాటలు తెలుగువారి ఇళ్లల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అలా లక్షలాది మంది హృదయాలలో ఏఎన్ఆర్ ఎప్పటికీ జీవించే ఉంటారు. ప్రేమకు నిర్వచనం.. త్యాగానికి ప్రతీక.. సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు మళ్లీమళ్లీ రావు అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఏఎన్ఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.
also read:Rajinikanth: 12 ఏళ్ల తర్వాత యానిమేషన్ మూవీగా సూపర్ స్టార్ మూవీ.. అప్పుడే రికార్డులు!
ఇకపోతే ఏఎన్ఆర్ లెగసీని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కొనసాగిస్తున్నారని చెప్పాలి. తండ్రికి తగ్గ తనయుడిగా ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న నాగార్జున.. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో దూసుకుపోతున్నారు. మరొకవైపు హీరోగా తన 100వ చిత్రంతో వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అలాగే ఈయన వారసులు అక్కినేని అఖిల్, అక్కినేని నాగచైతన్య కూడా తమ సినిమాలతో బిజీ కాబోతున్నారు. ఇక అందులో భాగంగానే నాగచైతన్య వృషకర్మ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకోవాలని ప్రయత్నం చేస్తున్న చైతూ.. ఈ సినిమా షూటింగులో ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏది ఏమైనా అక్కినేని వారసులు ఇప్పుడు తమకంటూ ఒక గుర్తింపు అందుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.
ప్రేమకు నిర్వచనం…
త్యాగానికి ప్రతీక…
సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం ❤️🔥Celebrating 4️⃣5️⃣ glorious years of #Premabhishekam, a historic blockbuster whose records, emotions and impact remain untouched even today✨
A timeless legacy of the legendary #ANR garu that… pic.twitter.com/Ifcorr71DG
— Annapurna Studios (@AnnapurnaStdios) February 18, 2026