E-Paper
Advertisement

Chiranjeevi vs Allu Arjun: చిరంజీవికి పోటీగా అల్లు అర్జున్ .. పండగ పూట పోటీ అవసరమా?

Chiranjeevi vs Allu Arjun: చిరంజీవికి పోటీగా అల్లు అర్జున్ .. పండగ పూట పోటీ అవసరమా?
Advertisement

Allu Arjun vs Chiranjeevi: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికీ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ వీడియో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే బోలెడు సినిమాలు విడుదలకు పోటీ పడుతున్నాయి.

అలా వైకుంఠపురములో రీ  రిలీజ్?

ఇలాంటి తరుణంలోనే పలు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో నటించిన అలా వైకుంఠాపురములో (Ala Vaikunthapurramuloo) తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జనవరి 12వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతుండటం విశేషం. ఇలా చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు పోటీగా అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో సినిమాని రీ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చిరంజీవి సినిమా విడుదలయ్యే సమయంలోనే అల్లు అర్జున్ సినిమాని రీ రిలీజ్ చేయడం అవసరమా? ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారా? అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

మండిపడుతున్న మెగా అభిమానులు..

Advertisement

సంక్రాంతి పండుగ అంటేనే ఎన్నో సినిమాలు విడుదలవుతాయి . కొత్త సినిమాలకి థియేటర్లు దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఏంటి అంటూ అభిమానులు మండిపడుతున్నారు. మరి అలా వైకుంఠపురం సినిమా తిరిగి విడుదల కాబోతోంది అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఇక అలా వైకుంఠపురం సినిమా 2020 సంవత్సరంలో సరిగ్గా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని తిరిగి అదే రోజున విడుదల చేయాలని భావించినట్టు సమాచారం.

సంక్రాంతికి భారీ పోటీ..

Advertisement

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ ది రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటితోపాటు తమిళ సినిమాలైన జననాయగన్, పరాశక్తి సినిమాలు కూడా సంక్రాంతి బరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలా ఈ స్థాయిలో పోటీ నడుమ  అల్లు అర్జున్ అలా వైకుంఠపురం రీ రిలీజ్ అవుతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై మెగా అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Upasana Konidela: బేబీ బంప్ తో దర్శనమిచ్చిన ఉపాసన…ఆ రూమర్లకు చెక్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×