E-Paper
Advertisement

Allu Arjun: కడింపల్లి దుర్గకు ఆర్థిక భరోసా..మాట నిలబెట్టుకున్న అల్లు అర్జున్..

Allu Arjun: కడింపల్లి దుర్గకు ఆర్థిక భరోసా..మాట నిలబెట్టుకున్న అల్లు అర్జున్..
Advertisement

Allu Arjun: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనలో భాగంగా దాదాపు 23 మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తండ్రిన కోల్పోయిన దివ్యాంగురాలు కడింపల్లి దుర్గకు (Kadimoalli Durga)జీవితాంతం ఆర్థిక భరోసా కల్పిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రతినెల ఆ మహిళకు 7500 రూపాయలు సహాయం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళ నిత్యావసర, మందుల నిమిత్తం అల్లు అర్జున్ ఈ మహిళకు అండగా నిలిచారు. ఇలా అల్లు అర్జున్ ఈ మహిళకు జీవితాంతం ప్రతినెల 7500 సహాయం చేస్తానని చెప్పడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈయన మంచి మనసు పై ప్రశంసలు కురిపించారు.

కడింపల్లి దుర్గకు అల్లు అర్జున్ సాయం..

ఇలా అల్లు అర్జున్ మాట ఇవ్వడమే కాకుండా మాట నిలబెట్టుకున్నారని చెప్పాలి. అల్లు అర్జున్ ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల కడింపల్లి దుర్గకు 7500 నేరుగా తన బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇందుకు సంబంధించిన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా అల్లు అర్జున్ ఇచ్చిన మాట ప్రకారం తన మాటను నిలబెట్టుకోవడంతో మరోసారి బన్నీ గొప్ప మనసు పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ కేవలం దుర్గకు మాత్రమే కాకుండా ఇటీవల సినీనటి పావలా శ్యామలకు కూడా ఆర్థిక భరోసా కల్పించిన సంగతి తెలిసిందే.

అట్లీ డైరెక్షన్ లో బిజీగా బన్నీ..

Advertisement

ఐకాన్ స్టార్ గా కొనసాగుతున్న అల్లు అర్జున్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఇలా సహాయ సహకారాలను అందిస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషానికి వస్తే.. సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. అత్యంత భారీ బడ్జెట్ హై యాక్షన్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు ఒక గ్లింప్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నారని సమాచారం.

Advertisement

ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని మరొక తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు ఈ సినిమాలో అల్లు అర్జున్ సూపర్ పవర్ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివరి నుంచి లోకేష్ కనగారాజ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ బిజీ కానున్నారు.

Also Read: Singer Mangli: బూతు పాట వివాదం పై స్పందించిన మంగ్లీ.. క్షమించండంటూ!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×