Allu Arjun: భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాలలో దాదాసాహెబ్ ఫాల్కే (Dada saheb Phalke Award)పురస్కారాలు ఒకటి . ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తించుకొని భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ 2025(DPIFF 2025) వేడుకలు ముంబైలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు అరుదైన గౌరవం దక్కింది.
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ లో భాగంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటనకు గాను “వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్” (Versatile Actor)గా బన్నీ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. ఇక ఈ విషయాన్ని ఈయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.. అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని నటనకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా తాను ఈ గౌరవాన్ని అందుకోవడానికి కారణం అభిమానులే అని తెలిపారు. తనకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తూ అండగా నిలిచిన అభిమానులకు ప్రేక్షకులకు ఈ సందర్భంగా అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈయన అందుకున్న ఈ అవార్డు అభిమానులకే సొంతం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సౌత్ సినిమాలకు కూడా మరికొన్ని పురస్కారాలు లభించాయి.వర్సటైల్ యాక్టర్ గా అల్లు అర్జున్ అవార్డును అందుకోగా వర్సటైల్ యాక్ట్రెస్ గా అమరన్ సినిమాకు గాను సాయి పల్లవి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
Thanks to the Dadasaheb Phalke International Film Awards for the incredible honour. Truly humbled. @Dpiff_official
My warm congratulations to all the winners across categories this year.
A sincere thank you to my audience for your continued love and support… I humbly dedicate…
— Allu Arjun (@alluarjun) November 2, 2025
ఇక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ పుష్ప2 సినిమాకు పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే బెస్ట్ ఫిలింగా ప్రభాస్ కల్కి సినిమా అవార్డును సొంతం చేసుకున్నారు.. ఇలా సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు అందడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పాన్ వరల్డ్ స్థాయిలో మారుమోగిపోతుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.
Also Read: SSMB 29: SSMB 29 అప్డేట్.. జియో హాట్ స్టార్ లో ప్రసారం..సినీ చరిత్రలోనే మొదటసారి ఇలా!