SSMB 29: టాలీవుడ్ సినీ ప్రేమికులు మహేష్ బాబు (Mahesh Babu),రాజమౌళి(Rajamouli) సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఓ చిన్న విషయాన్ని కూడా రాజమౌళి వెల్లడించలేదు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆశపడుతున్నారు. అయితే త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరబోతుందని తెలుస్తుంది. నవంబర్లో మహేష్ బాబు సినిమాకి సంబంధించిన టైటిల్ రివిల్ ఉంటుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం అధికారకంగా వెల్లడించడమే కాకుండా చాలా గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించబోతున్నారని ఈవెంట్ కి సంబంధించిన టైం, ప్లేస్ కూడా ప్రకటించారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. నవంబర్ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా వేడుకను హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారని చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమానికి ఎలాంటి హాలీవుడ్ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా పాల్గొనడం లేదని స్పష్టమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మాత్రమే పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఒక గ్లింప్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నారని సమాచారం. ఇక ఈ కార్యక్రమాన్ని అందరూ చూసే విధంగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ రివిల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio Hot Star) కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. జియో హాట్ స్టార్ లో ఈ కార్యక్రమం అవుతుందని అధికారకంగా వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఏ సినిమా టైటిల్ రివిల్ కార్యక్రమానికి సంబంధించిన హక్కులను ఏ ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయలేదు కానీ మొదటిసారి మహేష్ బాబు రాజమౌళి సినిమా విషయంలోనే ఇలా జరగటం విశేషం.
2027 ను టార్గెట్ చేసిన జక్కన్న..
ఇక ఈ సినిమా పట్ల ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయడానికి రాజమౌళి అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కెన్యా, ఒడిస్సా వంటి ప్రాంతాలలో కీలక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుది . ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకం పై కే ఎల్ నారాయణ భారీ బడ్జెట్ సినిమాగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని 2027వ సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Rashmika: రష్మికలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా..నిజంగా గ్రేట్ అబ్బా!