E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ గైర్హాజరు? లాయర్ ద్వారా మినహాయింపు పిటిషన్!

నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ గైర్హాజరు? లాయర్ ద్వారా మినహాయింపు పిటిషన్!
Advertisement

Allu Arjun Court: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నేడు (సోమవారం) నాంపల్లి కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ రోజు నిందితులంతా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం హీరో అల్లు అర్జున్ నేడు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావడం లేదని తెలుస్తోంది.

Read also-Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. ప్రభావతికి ఎన్ని కష్టాలో.. కుక్కల దెబ్బకు మనోజ్ కు షాక్.. దిగొచ్చిన ప్రభా..

లాయర్ ద్వారా హాజరు మినహాయింపు పిటిషన్!

Advertisement

ఈ కేసులో ఏ11 (A11) నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్, నేడు కోర్టుకు వచ్చే అవకాశం లేదని ఆయన న్యాయవాద వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ బన్నీ తరపు లాయర్ నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తరపున ఆయన లాయరే నేడు కోర్టుకు హాజరై వాదనలు వినిపించనున్నారు. దీంతో అల్లు అర్జున్ వస్తారా రారా అనే ఉత్కంఠకు తెరపడినట్లయింది.

కేసు నేపథ్యం..

‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సమయంలో అభిమానులు భారీగా తరలిరావడంతో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన చిక్కడపల్లి పోలీసులు ఇటీవల కోర్టులో సుదీర్ఘ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు, భద్రతా సిబ్బందిని A1 నుంచి A10 నిందితులుగా పేర్కొన్నారు. సరైన ముందస్తు సమాచారం, పోలీసుల అనుమతి లేకుండానే అల్లు అర్జున్ ఈవెంట్‌కు రావడం వల్లే అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారని, తద్వారానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొంటూ ఆయన్ను 11వ నిందితుడిగా (A11) చేర్చారు.

Advertisement

Read also-Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. అయ్యో.. అడ్డంగా దొరికిందిగా.. కమల్ ఝలక్..

నేడే ట్రయల్స్ ప్రారంభం?

న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నిందితులంతా వ్యక్తిగతంగా హాజరైతేనే ఈ రోజు నుంచి కేసు ట్రయల్స్ అధికారికంగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ తరపు లాయర్ మినహాయింపు పిటిషన్ వేస్తుండటంతో, దీనిపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోర్టు ఈ పిటిషన్‌ను అంగీకరిస్తుందా? లేదా తదుపరి విచారణకు ఖచ్చితంగా హాజరుకావాలని ఆదేశిస్తుందా అనేది చూడాలి.

Related News

తెరపై ‘దళపతి’.. గద్దెపై ‘అధినేత’.. తమిళనాడు సీఎం విజయ్ బర్త్‌డే స్పెషల్!

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్?

నాగచైతన్యతో మాతృత్వం గురించి సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్..

Spirit Movie : ప్రభాస్ మూవీకి కొత్త కష్టాలు.. డైరెక్టర్ పై ఫ్యాన్స్ ఫైర్..!

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు క్రేజీ కాంబో.. ప్రియదర్శి, నాగదుర్గల ‘ఫ్యామిలీ డ్రామా’ షురూ!

అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్.. కనిపించే దేవుడు అంటూ..

పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘ఓజీ2’ చర్చలు షురూ చేసిన సుజిత్!

Big Stories

×