E-Paper
Advertisement

Anasuya Bharadwaj: పరువు పోయే పనులు అవసరమా.. ఘాటైన సమాధానం ఇచ్చిన అనసూయ..!

Anasuya Bharadwaj: పరువు పోయే పనులు అవసరమా.. ఘాటైన సమాధానం ఇచ్చిన అనసూయ..!
Advertisement

Anasuya Bharadwaj: విషయం ఎలాంటిదైనా… ముందుండి మాట్లాడే వ్యక్తిగా అనసూయ తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. గుర్తింపు పొందింది. ఇటీవల నటుడు శివాజీ అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు పైన కూడా ఈమె ఎక్కువగానే రియాక్ట్ అయ్యింది. దాదాపు ప్రతి విషయానికి రియాక్ట్ అయ్యే అనసూయని కొందరు సపోర్ట్ చేయగా కొందరు మాత్రం నెగటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు అవసరం లేకుండా మాటలతో తన పరువు తానే తీసుకుంటోందని విమర్శిస్తూ కూడా ఉంటారు. ఈ క్రమంలో ఈ నటి ఈ విషయాలపై ఒక ఇంటర్వ్యూలో స్పందించింది

శివాజీ వ్యాఖ్యల తర్వాత “అనసూయ చీరలు కడుతుందట” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి దీనిపైన మీ స్పందన ఏమిటి అని యాంకర్ ఆమెను అడగా.. “నా తరపున వాళ్లకు రెండు మొట్టికాయలు వేయండి” అంటూ చెప్పుకొచ్చింది. తనకు చీరలంటే ఇష్టం అని..అలాగే ఫ్యాషన్ డ్రెస్స్‌లంటే కూడా ఇష్టమేనని చెప్పింది. తనకు ఎప్పుడు ఏది వేసుకోవాలనిపిస్తే అదే వేసుకుంటానని.. ఇది ప్రతి ఒక్కరికీ ఉన్న హక్కు అని అనసూయ తెలిపింది.

Advertisement

శారీ స్టోర్ ఓపెనింగ్‌కు వెళ్తే చీర కట్టుకుంటానని, అదే విధంగా వేరే ఈవెంట్లకు వేరే డ్రెస్స్‌లు వేసుకుంటానని చెప్పింది. గత పదేళ్లుగా ఇదే చేస్తున్నానని..ఇందులో కొత్తగా ఏమీలేదని స్పష్టం చేసింది.

అదే సమయంలో శివాజీ మాటలపై కూడా మరోసారి తన అభిప్రాయం చెప్పింది. మహిళల భద్రత గురించి మంచి ఉద్దేశంతో మాట్లాడటం తప్పు కాదని..కానీ కొన్ని పదాలు వాడకుండా ఉంటే ఇంకా బాగుండేదని అనసూయ చెప్పింది. సినిమా పాత్రల ప్రభావాన్ని నిజ జీవితంలోకి తీసుకురావద్దని… సినిమాలో చేసిన పాత్రలు సినిమా వరకే పరిమితం కావాలని తెలిపింది.

Advertisement

మహిళల భద్రత గురించి మాట్లాడేటప్పుడు అబ్బాయిలను కూడా బాధ్యతగా ఉండమని.. అమ్మాయిలకు తోడుగా ఉంటామని.. శివాజీ గారు చెప్పుంటే బాగుండేది అని.. అలా చెప్పితే సమాజానికి మంచి సందేశం వెళ్లేదని అనసూయ అభిప్రాయపడింది.

“అటెన్షన్ కోసం అన్ని విషయాల్లో కలగజేసుకొని మీ పరువు తీసుకుంటున్నారు కదా..” అనే విమర్శలపై కూడా ఆమె స్పందించింది. ఇక్కడ ఎవరి పరువు పోయిందని ప్రశ్నించింది. తన పరువు తన దగ్గరే భద్రంగా ఉందని..తాను ఎప్పుడూ నెగెటివ్‌గా మారలేదని చెప్పింది.

ట్రోల్స్ గురించి మాట్లాడుతూ..తన భర్త తనను పూర్తిగా అర్థం చేసుకుంటాడని తెలిపింది. తన భర్త, పిల్లలను ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంచుతానని చెప్పింది. అర్థం చేసుకునే భర్త దొరకడం తన అదృష్టమని అనసూయ చెప్పింది. తన జీవితం, తన నిర్ణయాలు.. వాటి ప్రభావం తనవేనని ఆమె మరోసారి స్పష్టం చేసింది.

ALSO READ: Sobhita Dhulipala: పెళ్లి తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన అక్కినేని పెద్ద కోడలు.. పోస్ట్ వైరల్!

Related News

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

Big Stories

Advertisement
×