Anaganaga oka raju Pre release: డైరెక్టర్ మారి దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వరంగల్ లో ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా నుంచి మరొక సాంగ్ విడుదల చేశారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి బెల్లా.. బెల్లా, రాజుగారి పెళ్లి అంటూ పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలకు ఎంతో మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక పాటను ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేశారు. ఆంధ్ర టు తెలంగాణ(Andhra To Telangana) అంటూ సాగిపోయే ఈ స్పెషల్ సాంగ్ ను విడుదల చేయడంతో ఈ పాట కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ లిరిక్స్ అందించగా, సింగర్ ధనుంజయ్, సమీరా భరద్వాజ్ ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఈ అప్డేట్స్ చూస్తుంటే మాత్రం నవీన్ పోలిశెట్టి గ్యారెంటీగా హిట్ కొట్టబోతున్నారని తెలుస్తోంది. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోలతో పోటీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలు మీనాక్షి చౌదరి చారులత అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా మీనాక్షి హీరోయిన్ గా నటించిన నేపథ్యంలో ఈ సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న మీనాక్షి చౌదరి ఈ ఏడాది అనగనగా ఒక రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ సంక్రాంతి ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి హిట్ ఇవ్వబోతుందో వేచి చూడాలి. ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. నాగ వంశీ నిర్మాతగా ఇటీవల వరుస సినిమాల ద్వారా నిరాశను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సినిమా పక్క ఎంటర్టైనర్ గా ఉండబోతోంది అంటూ చిత్ర బృందం ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Lokesh Kanagaraj: అల్లు అర్జున్ సినిమాకు లోకేష్ దిమ్మ తిరిగిపోయే రెమ్యూనరేషన్?