Bellamkonda srinivas: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత కొడుకుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈయన ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి అనే అమ్మాయితో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వీరి వివాహం ఏప్రిల్ 29 వ తేదీ తిరుపతిలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సాంప్రదాయ పద్ధతి ప్రకారం వీరి వివాహపు వేడుకలు జరిగాయి.
ఇలా పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యల వివాహం తిరుపతిలో జరగడంతో కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు. ఇలా తిరుపతిలో వివాహం చేసుకున్న ఈ జంట మే ఒకటవ తేదీ హైదరాబాదులో చాలా ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ వేడుకలో భాగంగా సినీ ప్రముఖులు మొత్తం హాజరై సందడి చేశారు.
ప్రస్తుతం వీరి పెళ్లి రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన భార్య గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు. ఇప్పటివరకు నేను కనుగొన్న వాటన్నింటి కంటే గొప్ప దాన్ని కనుగొన్నాను.. ప్రపంచమా నా భార్యను కలుసుకో అంటూ ఈయన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ఇలా ఈ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ఈయన “నా పెళ్ళాం నిప్పు రా” అంటూ జయ జానకి నాయక సినిమాలోని డైలాగ్ రిక్రియేట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది.
In the midst of everything I've built, I found something far greater. World, meet my wife. #Kavyaamma #kavyabellamkonda
NA PELLAM NIPPU RA 🔥#Sreenivasakavyanam pic.twitter.com/S7dLxBeqtq
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) May 1, 2026
తన భార్య గురించి ఎంతో గొప్పగా ఎలివేషన్ ఇస్తూ తన భార్య నిప్పు అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పడంతో అన్న సోషల్ మీడియా మీమ్స్ బాగా ఫాలో అవుతున్నాడు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం అన్న నిప్పుతో జాగ్రత్త ఇటీవల కాలంలో చాలామంది తగలబడి పోతున్నారు అంటూ ఫన్నీగా ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన భార్య పట్ల తనకున్నటువంటి ప్రేమను ఇలా చాటి చెబుతూ ఈ పోస్ట్ చేశారని తెలుస్తుంది. ఇక వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో అంగర వైభవంగా వివాహం జరుపుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
Also Read: రష్మీ పై వైసీపీ నేతలు ట్రోల్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన యాంకరమ్మ .. తగ్గేదేలేదంటూ!