E-Paper
Advertisement

రేపే టాలీవుడ్ హీరో పెళ్లి.. అందంగా ముస్తాబవుతున్న వేదిక!

రేపే టాలీవుడ్ హీరో పెళ్లి.. అందంగా ముస్తాబవుతున్న వేదిక!

Tollywood Hero: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు ఘనంగా మోగనున్నాయి. ఈ జంటను కలపడానికి కల్యాణ వేదిక అందంగా ముస్తాబవుతోంది. పలువురు సినీ సెలబ్రిటీల రాకతో తిరుమల తిరుపతి దేవస్థానం కళకళ లాడబోతోంది అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు.. యువ హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొన్ని రోజుల క్రితమే ప్రీ ఎంగేజ్మెంట్ జరుపుకొని తమ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నామని అధికారికంగా ప్రకటించిన ఈయన.. తన ప్రేయసి కావ్య రెడ్డితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

రేపే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి..

ఆ తర్వాత పసుపు దంచే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న ఈ జంట.. ఆ తర్వాత జంటగా పలువురు సినీ సెలబ్రిటీలను ఆహ్వానించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇకపోతే ఈరోజు పెళ్లి కొడుకుగా అందంగా ముస్తాబైన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇకపోతే నేడు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేవుడి ఆశీస్సులతో కుటుంబ సభ్యుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఏప్రిల్ 29 2026 అనగా బుధవారం రోజు రాత్రి 11:13 గంటలకు వేద మంత్రోచ్ఛారణ మధ్య సంప్రదాయబద్ధంగా బెల్లంకొండ శ్రీనివాస్ కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు. సనాతన హిందూ ధర్మం ప్రకారం వీరు వివాహం జరిపిస్తున్నట్లు బెల్లంకొండ కుటుంబం స్పష్టం చేసింది. ఇకపోతే ఈ వివాహ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఘనంగా రిసెప్షన్.. ముఖ్యమంత్రులు రాక..

తిరుమల తిరుపతిలో వివాహమైన తర్వాత మే 31వ తేదీన హైదరాబాద్ సిటీలో వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఘనంగా ఏర్పాటు చేశారు.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు, తెలుగు చలనచిత్ర సీమ ప్రముఖులను బెల్లంకొండ కుటుంబం స్వయంగా కలిసి పెళ్లి రిసెప్షన్ కి తప్పకుండా రావాలి అని నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరిన విషయం అందరికీ తెలిసిందే.

బెల్లంకొండ సినిమా కెరియర్..

బెల్లంకొండ కెరియర్ విషయానికి వస్తే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన ఇటీవల భైరవం సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు కిష్కిందపురి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. వివాహం తర్వాత కొంతకాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ తన తదుపరి సినిమాల షూటింగ్లో బిజీ కానున్నట్లు సమాచారం.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×